క్రికెటర్లను అభిమానులను గుర్తించేందుకు
మైదానంలో ఆడుతోన్న క్రికెటర్లను అభిమానులను గుర్తించేందుకు ఐసీసీ కొత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. 142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇలా జెర్సీలపై ఆటగాళ్ల పేర్లతో పాటు నంబర్లను ముద్రించడం ఇదే తొలిసారి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా యాషెస్ సిరీస్ నుంచి ఈ సంప్రదాయానికి తెరలేపారు.
100 యాషెస్ వికెట్లు.. స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు
|
చెత్తగా ఉందన్న గిల్క్రిస్ట్
అయితే టెస్టు జెర్సీలపై క్రికెటర్ల పేర్లూ, నంబర్లు ముద్రించడం చాలా చెత్తగా ఉందని మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. "ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. మనమింకా పోటీలో ఉన్నాం. ఇలా చెబుతున్నందుకు మన్నించండి. కానీ.. జెర్సీలపై ఆటగాళ్ల పేర్లూ, నంబర్లు నచ్చడం లేదు" అని ఒక ట్వీట్ చేశాడు.
|
నా క్షమాపణల్ని వెనక్కి తీసుకుంటున్నా
ఆ తర్వాత మరొక ట్వీట్లో "నిజం చెప్పాలంటే నా క్షమాపణల్ని వెనక్కి తీసుకుంటున్నా. పేర్లూ, నంబర్లు చెత్తగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ యాషెస్ను ఆస్వాదించండి" అని గిల్ క్రిస్ట్ ట్వీట్ చేశాడు. కాగా, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ యాషెస్ సిరిస్తోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఆ అధికారం లేదు: బీసీసీఐకి కేంద్ర క్రీడాశాఖ మధ్య చిచ్చు పెట్టిన పృథ్వీ షా నిషేధం
టెస్టు ఛాంపియన్షిప్లో తొమ్మిది జట్లు
ఈ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా తొమ్మిది జట్లు 71 మ్యాచ్ల్లో 27 ద్వైపాక్షిక టెస్టు సిరీస్లు ఆడనున్నాయి. ప్రతీ జట్టూ మిగిలిన ఎనిమిది జట్లలోని ఏవైనా ఆరు జట్లతో తలపడనున్నాయి. ఇందులో భాగంగా మూడు సిరీస్లు స్వదేశంలో ఆడగా మిగతా మూడు సిరిస్లు విదేశాల్లో ఆడతాయి.