ఆదుకున్న లబ్షేన్:
ఆర్చర్, జాక్ లీచ్ ధాటికి లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (5), బాన్క్రాఫ్ట్ (16).. ఉస్మాన్ ఖవాజా (2)లు త్వరగానే పెవిలియన్ చేరారు. దీంతో ఆస్ట్రేలియా 14 ఓవర్లకు 47/3తో నిలిచింది. ఆట ముగియడానికి ఇంకా 34 ఓవర్లు ఉండడంతో ఆస్ట్రేలియా ఆలౌట్ అవుతుందేమో అని అనిపించింది. అయితే స్మిత్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోదిగిన లబ్షేన్ (59) కీలక ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకంతో ఆదుకున్నాడు.
హెడ్ పట్టుదల:
లబుషేన్కి తోడు హెడ్ (42 నాటౌట్) కూడా రాణించడంతో ఆసీస్ కోలుకుంది. కానీ లబుషేన్, వేడ్ (1)లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేసిన లీచ్.. మళ్లీ ఇంగ్లాండ్కు ఆశలు కల్పించాడు. అయితే హెడ్ పట్టుదల ప్రదర్శించడంతో ఆసీస్ కోలుకుంది. కెప్టెన్ టీమ్ పైన్ (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా.. కమిన్స్ వికెట్ కాపాడుకున్నాడు. దీంతో మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతూ చివరకు డ్రాగా ముగిసింది.
181 పరుగులకే విండీస్ ఆలౌట్.. పట్టుబిగించిన భారత్
స్టోక్స్ సెంచరీ:
అంతకుముందు 96/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్.. 258/5 వద్ద డిక్లేర్ చేసింది. వరల్డ్కప్ ఫామ్ చూపిస్తూ స్టోక్స్ సెంచరీతో అలరించాడు. బట్లర్ (31), బెయిర్స్టో (30 నాటౌట్)లతో స్టోక్స్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మ్యాచ్లో వర్షం వల్ల దాదాపు రెండు రోజుల ఆట రద్దయింది. వర్షం ప్రభావం లేకుంటే మ్యాచ్ ఫలితం వచ్చేదే. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 258 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 250కి ఆలౌటైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టోక్స్కు దక్కింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు లీడ్స్లో శుక్రవారం ఆరంభమవుతుంది.