హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు మన దేశానికి గర్వకారణమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇటీవలే జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఫోటో: అనుష్కలో ఎంత మార్పు!: కోహ్లీసేనతో ఫోటో దిగలేదు
ఈ నేపథ్యంలో సింధు తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమెను వెంకయ్య అభినందించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు.
Conveyed my heartiest congratulations once again to World Badminton Champion Ms. P.V. Sindhu, who called on me along with her parents this morning. She is the pride of our nation. She is an inspiration to all youngsters in the country. #Sindhu #pvsindhu1 pic.twitter.com/paGWCt82WI
— VicePresidentOfIndia (@VPSecretariat) August 31, 2019
"పీవీ సింధు మన దేశానికి గర్వకారణం. ఆమె దేశంలోని యువకులందరికీ ఆదర్శం. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో విజయాలను అందుకోవాలి" అని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో సింధు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి షటిల్ బ్యాట్ని అందించారు. గత ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
యాషెస్ 2019: టూర్ మ్యాచ్లో విఫలం, 4వ టెస్టులో స్మిత్ ఆడతాడా?
ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది.