హైదరాబాద్: సౌత్ ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్లో భారత క్రీడాకారులు అబ్బురపరిచారు. కొలంబోలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారులు మొత్తం 10 స్వర్ణాలను కైవసం చేసుకున్నారు.
ఛాంపియన్షిప్స్లో భాగంగా చివరి రోజైన ఆదివారం ఆరు స్వర్ణాలను సాధించారు. దీంతో పాటు పాటు నాలుగు రజత పతకాలూ గెలిచారు. దీంతో ఈ ఛాంపియన్షిప్స్లో భారత్ మొత్తం 14 పతకాలను సాధించింది.
చివరి రోజు బాలుర విభాగం ఫైనల్లో టాప్ సీడ్ మనవ్ టక్కర్ 11-6, 6-11, 11-7, 11-9 తేడాతో పార్థ్ విర్మనిని ఓడించాడు. ఇక బాలికల విభాగంలో అర్చన 11-9, 11-5, 11-7తో ప్రియాంకను ఓడించింది.