హైదరాబాద్: భారత్ తన తదుపరి డేవిస్ కప్ పోరును ఏప్రిల్లో ఉజ్భెకిస్థాన్తో ఆడనుంది. ఏప్రిల్లో జరగనున్న ఈ డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్ మ్యాచ్ బెంగుళూరులోని కర్ణాటక లాన్ టెన్నిస్ అసోసియేషన్ (కేఎసఎల్టీఏ) ఆతిథ్యం ఇవ్వనుంది.
ఆసియా ఓసియానియా గ్రూప్-1 పోరులో భాగంగా ఇటీవలే జరిగిన తొలి రౌండ్లో న్యూజిలాండ్ను 4-1తో ఓడించి భారత్ రౌండ్-2కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి మొదటివారంలో కోరియాతో జరిగిన పోరులో 3-1తో ఉజ్భెకిస్థాన్ విజయం సాధించింది.
చివరిగా 2014 సెప్టెంబర్లో బెంగళూరులో సెర్బియాతో భారత్ డేవిస్కప్ ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్ పోరులో తలపడింది. ఈ పోరులో భారత్ 2-3తో భారత్ ఓటమి పాలైంది. ఇక భారత్, ఉజ్భెకిస్థాన్ జట్ల ముఖాముఖి పోరులో 2-2తో సమంగా ఉన్నాయి. ఈ పోరులో విజయం సాధించిన జట్టు సెప్టెంబర్లో జరిగే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్స్లో ఆడనుంది.