‘అర్జున’ రేసులో అంకిత, దివిజ్

న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారులు అంకితా రైనా, దివిజ్ శరణ్ కేంద్ర ప్రభుత్వ పురస్కారం 'అర్జున' అవార్డు బరిలో నిలిచారు. 2018 ఆసియా క్రీడల మెడల్స్ విన్నర్స్ అయిన వీరిద్దరి పేర్లను అర్జున అవార్డు కోసం ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) నామినేట్ చేసింది. 27 ఏళ్ల అంకిత 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగి ల్స్లో కాంస్య పతకం సాధించింది. ఫెడ్క్పలోనూ ఆమె అద్భుతంగా రాణించింది. వరల్డ్కప్ ప్లేఆఫ్స్కు భారత్ తొలిసారి క్వాలిఫై కావడంలోనూ కీలకపాత్ర పోషించింది.
ఢిల్లీకి చెందిన దివిజ్ శరణ్ వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి 2018 ఆసియా క్రీడల్లో డబుల్స్లో స్వర్ణం గెలిచాడు. 2019లో అతను రెండు ఏటీపీ టైటిళ్లు నెగ్గాడు. డేవిస్ కప్ మాజీ కోచ్ నందన్బాల్ (60) పేరును 'ధ్యాన్చంద్' పురస్కారానికి ప్రతిపాదించారు. కాగా, భారత డేవిస్ కప్ మాజీ ఆటగాడైన నందన్బాల్.. రిటైర్మెంట్ తర్వాత చాన్నాళ్లు డేవిస్ కప్ కోచ్గా పని చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications