2016, 17 సంవత్సరాల్లో ఈ పురస్కారానికి సంజిత చాను దరఖాస్తు చేసుకున్నా పరిశీలనకు నోచుకోలేదు. 2017లో తన పేరు జాబితా నుంచి తొలగించడంపై ఢిల్లీ హైకోర్టులో సంజిత ఓ రిట్ పిటిషన్ వేశారు. అయితే ఈ కేసు నడుస్తుండగానే.. ఆమె 2018 మేలో డోపింగ్ కేసులో ఇరుక్కున్నారు. సంజిత పేరును అవార్డుకు పరిగణించాలని.. ఆమె డోపింగ్కు పాల్పడలేదని తేలిన తర్వాత నిర్ణయాన్ని వెలువడించాలని ఆ ఏడాది ఆగస్టులో అవార్డుల కమిటీని హైకోర్టు ఆదేశించింది.
సంజితకు అర్జున అవార్డు ఖరారైందని త్వరలోనే అందజేస్తారని భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి చెప్పారు. 2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో సంజిత స్వర్ణ పతకాలు సాధించారు. 'సంజితపై ఉన్న అన్ని డోపింగ్ అభియోగాలను అంతర్జాతీయ సమాఖ్య తొలగించింది. అందుకే 2018లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి.. అర్జున అవార్డు కోసం ఆమె పేరును పరిగణనలోకి తీసుకుంటాం' అని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పా రు.
డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజిత చానుకు ఇటీవలే ఊరట లభించింది. ఏ తప్పు చేయలేదని చెప్పినప్పటికీ డోపింగ్ పేరుతో తనను మానసిక క్షోభకు గురి చేశారని, దానికి తగిన మూల్యం చెల్లించాలని ఐడబ్ల్యూఎఫ్ను సంజీత చాను డిమాండ్ చేసారు. 'డోపింగ్ వివాదం నుంచి బయటపడ్డందుకు ఆనందంగా ఉంది. కానీ దాని వల్ల నేను కోల్పోయిన అవకాశాల మాటేమిటి, నాకు జరిగిన మానసిక గాయాన్ని ఎవరు నయం చేస్తారు, శాంపిల్ను పరీక్షించే క్రమంలో ప్రతి దశలోనూ జరిగిన తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు' అని ప్రశ్నించారు.
హార్దిక్.. నీ కళ్లు కృనాల్ మీదే ఉన్నాయి: కోహ్లీ