57 కేజీల విభాగంలో
ఇక, 57 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్ రవి దహియ 6-3తో ఆసియా చాంపియన్ రెజా అత్రి నాగర్చి (ఇరాన్)పై నెగ్గి కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. వెటరన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు (74 కేజీలు) తొలి రౌండ్లోనే 9-11తో ఖాజిమురాద్ (అజర్బైజాన్) చేతిలో ఓడాడు.
వరుసగా 7 పాయింట్లు
ఒక దశలో 9-4తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు కోల్పోయాడు. బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన సుశీల్ 2010లో ప్రపంచ చాంపియన్గా నిలిచాడు. లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించాడు. సుశీల్పై గెలిచిన ఖద్జిమురద్ క్వార్టర్స్లో ఓడిపోవడంతో భారత రెజ్లర్కు ‘రెపిచేజ్' అవకాశం లేకుండా పోయింది.
నా జీవితంలో మరువలేను
పోరు అనంతరం భజరంగ్ పూనియా మాట్లాడుతూ "టోర్నీ నిర్వాహకుల తీరును జీవితంలో మరువలేను. అసలు కాంస్య పతక పోరులో బరిలో దిగకూడదని అనుకున్నా. కానీ పతకం ఏదైనా పతకమే అవుతుందని నా కోచ్లు సర్దిచెప్పడంతో బౌట్లో అడుగుపెట్టా" అని తెలిపాడు.
|
ఆరంభంలో వెనుకపడటం నా స్టైల్
"ఆరంభంలో వెనుకపడటం నా స్టైల్. గత నాలుగేళ్లుగా ఇదే కొనసాగిస్తున్నా. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించాలని చాలా కష్టపడ్డా. రిఫరీలు నా పట్ల ప్రవర్తించిన తీరుని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నా" అని భజరంగ్ పూనియా అన్నాడు.