ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ
చివరకు ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆ తర్వాత ఆమె చెక్ను ఆయన చేతుల మీదుగా అందుకున్నారు. ఇక, సుధా విషయానికి వస్తే, 2010లో జరిగిన ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధించగా, ఇటీవల జకార్తా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో రజత పతకం గెలుచుకుంది.
యూపీ స్పోర్ట్స్ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్ పదవి
రెండు సార్లు భారతదేశం పేరుని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేసిన తనకు ప్రభుత్వం యూపీ స్పోర్ట్స్ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్ పదవి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెక్ తీసుకోవడానికి నిరాకరించి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో గవర్నర్ రామ్ నాయక్ కూడా అక్కడే ఉన్నారు.
హామీ ఇవ్వడంతో తిరిగి వచ్చి చెక్ తీసుకున్న సుధా
ఈ ఘటనతో ఐదు నిమిషాల పాటు కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి వచ్చి చెక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సుధా సింగ్ మాట్లాడుతూ "నాకు డబ్బులు అక్కర్లేదు, ఉద్యోగం కావాలి. నాకు ఇవ్వాల్సిన డబ్బును రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు పంపిణీ చేయండి. నాకు మాత్రం ఉద్యోగం ఇవ్వండి" అని ఆమె కోరారు.
ప్రస్తుతం సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్గా ఉద్యోగం
"నాకు ఉద్యోగం ఇవ్వడం స్పోర్ట్స్ డైరెక్టరేట్లో కొందరికి ఇష్టం లేదు. నాకు డిప్యూటీ డైరెక్టర్గా ఉద్యోగం ఇవ్వకపోతే, నాకు ఇచ్చిన నజరానా సొమ్మును తిరిగి ఇచ్చేస్తాను. రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతాను" అని సుధా సింగ్ గట్టిగా మాట్లాడారు. 32ఏళ్ల సుధా సింగ్ ప్రస్తుతం సెంట్రల్ రైల్వేలో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. 2014లో యూపీ స్పోర్ట్స్ డైరెక్టరేట్లో రీజినల్ ఆఫీసర్గా చేరారు. ఆ తర్వాత భారత్కు పతకాలు అందిస్తోండటంతో ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ పదవి కోరుతుండటం విశేషం.