
టోక్యో: అంగరంగ వైభవంగా ఆరంభమైన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్లో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని అందుకుంది డ్రాగన్ కంట్రీ. టోక్యో ఒలింపిక్స్లో అందుకున్న తొలి స్వర్ణం అది. దిగ్విజయంగా బోణీ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్లో ఇప్పటిదాకా ఏ విభాగానికైనా ఇదే తొలి గోల్డ్ మెడల్. చైనాకు చెందిన స్టార్ విమెన్ షూటర్ యాంగ్ క్వియాన్.. తన తడాఖా చూపించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కేటగిరీలో స్వర్ణ పతకాన్ని సాధించింది.
అక్కడితో ఆగలేదు చైనా దూకుడు. 10 మీటర్ల పురుషుల విభాగంపైనా చైనా ఆధిపత్యాన్ని చలాయించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం, కాంస్య పతకాలను అందుకుంది. ఈ కేటగిరీలో గోల్డ్ మెడల్ను అమెరికా ఎగరేసుకెళ్లింది. అమెరికా షూటర్ విలియమ్ షేనర్ బంగారు పతకాన్ని గెలచుకున్నాడు. చైనా షూటరలు షెంగ్ లిహావో, యాంగ్ హావోరాన్ రజతం, కాంస్య పతకాలను అందుకున్నారు. ఈ ముగ్గురూ టీనేజర్లే. ఒలింపిక్స్లో తొలి పతకాన్ని అందుకున్న వారే.
మూడు స్వర్ణాలు, ఒక రజతంతో నాలుగు పతకాలను అందుకున్న జపాన్ రెండో స్థానంలో కొనసాగుతోండగా.. రెండు చొప్పున బంగారు పతకాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఎనిమిది పతకాలతో అమెరికా మూడో ప్లేస్ను ఆక్రమించింది. ఊహించినట్టే చైనా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆ దేశానికి చెందిన అథ్లెట్లకు మంచి పట్టు ఉన్న విభాగాల్లో ఖచ్చితంగా మెడల్స్ వస్తాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దానికి అనుగుణంగా చైనా అథ్లెట్ల ప్రదర్శన కొనసాగుతోంది.