ఇరాన్ స్వర్ణం సాధించడం వెనుక భారత్ ప్రమేయం
అయితే, కబడ్డీలో మహిళల విభాగంలో ఇరాన్ స్వర్ణం సాధించడం వెనుక భారత్ ప్రమేయం ఉండటం విశేషం. ఇరాన్ మహిళల కబడ్డీ జట్టుకు కోచింగ్ ఇచ్చింది భారత కోచ్ షెల్జా జైన్ కాబట్టి. ఇరాన్ను ప్రపంచంలో అగ్రశ్రేణి జట్టుగా తీర్చిదిద్ది అత్యుత్తమ కోచ్ అనిపించుకోవడమే లక్ష్యంగా ఆమె ఈ ఆసియా గేమ్స్ బరిలోకి దిగింది. అనుకున్నది సాధించింది.
నాసిక్కు చెందిన షెల్జా
నాసిక్కు చెందిన షెల్జా.. ఇరాన్ కోచ్గా 18 నెలల క్రితం బాధ్యతలు చేపట్టింది. ఇరాన్ మహిళల కబడ్డీ జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ జట్టు అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో ఆ జట్టు సాధించిన విజయాల్లో షెల్జా జైన్దే కీలకపాత్ర. ఫైనల్ అనంతరం షెల్జా మీడియాతో మాట్లాడారు.
డిఫెన్స్లో ఇరాన్ చాలా బలంగా తయారైంది
"ఇరాన్కు తొలిసారి వెళ్లినప్పుడే అనుకున్నా. ఆ జట్టును ప్రపంచ ఉత్తమ జట్టుగా నిలపాలని. కోచ్గా నేనెంటో నిరూపించుకోవాలని. డిఫెన్స్లో ఇరాన్ చాలా బలంగా తయారైంది. భారత్తో ఆసియా క్రీడల కబడ్డీ ఫైనల్లో సత్తా చాటింది. ఒక భారతీయురాలిగా నా జట్టు ఓడినందుకు చాలా బాధగా ఉంది. కానీ కోచ్గా ఇరాన్ గెలవాలనే కోరుకున్నా" అని షెల్జా చెప్పింది.
స్వర్ణ పతకం లేకుండా తిరుగుముఖం పట్టిన కబడ్డీ జట్లు
మరోవైపు ఈ ఆసియా గేమ్స్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత పురుషుల కబడ్డీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీఫైనల్లో భాగంగా ఇరాన్తో జరిగిన పోరుతో భారత కబడ్డీ జట్టు 27-18తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొత్తంగా.. ఆసియా గేమ్స్ చరిత్రలో తొలిసారి భారత కబడ్డీ జట్లు స్వర్ణ పతకం లేకుండా తిరుగుముఖం పట్టాయి.