చక్కటి ఫామ్లో ఇరు జట్లు
ఈ ఏడాది భారత హాకీ జట్లు చక్కటి ఫామ్లో ఉన్నాయి. గత ఆదివారం ఓమన్ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ జట్టుతో కలిసి సంయుక్తంగా టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఆస్ట్రేలియా
ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగబోతోంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు పూల్స్గా విభజించారు. అన్ని జట్లు కూడా గ్రూప్ స్టేజిలో మూడు మ్యాచ్లు ఆడతాయి. డిసెంబర్ 9 నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి.
మస్కట్ను విడుదల చేసిన నవీన్ పట్నాయక్
ఇప్పటికే టోర్నీకి సంబంధించిన మస్కట్ను ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మస్కట్ పేరు మస్కట్ ‘ఓల్లీ'. ఒడిషాలో సముద్ర తీరంలో కనిపించే అతి అరుదైన ఓలివ్ రిడ్లే తాబేలును హాకీ వరల్డ్కప్ కోసం మస్కట్గా ఎంచుకోవడం విశేషం.
|
అరుదైన సముద్ర తాబేళ్లు
అంతరించేపోయే పరిస్థితిలో ఉన్న ఈ అరుదైన సముద్ర తాబేళ్ల నివాస ప్రాంతాలను సంరక్షించేందుకు ఒడిషా ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కృషి చేస్తోంది. ఆ ప్రయత్నాన్ని ప్రపంచానికి తెలియచేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓలివ్ రిడ్లే తాబేలును మస్కట్గా ఎంచుకున్నట్టు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.