హాకీ అభివృద్ధికి అండగా నిలుస్తామని ప్రకటించిన జావేద్ అఫ్రిది
పాకిస్థాన్ హాకీ జట్టు ఆడనున్న అంతర్జాతీయ పర్యటనలతో పాటు దేశంలో కూడా హాకీ అభివృద్ధికి అండగా నిలుస్తామని జావేద్ అఫ్రిది ప్రకటించారు. ఈ స్పాన్సర్షిప్ 2020 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న ఆటగాళ్లకు దినసరి భత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో పాక్ హాకీ సమాఖ్య ఉంది.
భువనేశ్వర్ వేదికగా హాకీ వరల్డ్ కప్
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.80 మిలియన్ల నిధులను వెంటనే విడుదల చేయాలని... అలా చేయకపోతే భారత్లోని భువనేశ్వర్ వేదికగా జరిగే హాకీ వరల్డ్కప్లో పాల్గొనబోమని పీహెచ్ఎఫ్ హెచ్చరించింది. అయినా కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో పాకిస్థాన్ హాకీ జట్టు వరల్డ్ కప్లో పాల్గొనబోవడం లేదని వార్తలు వచ్చాయి.
పీసీబీని రుణం అడిగిన పీహెచ్ఎఫ్
మరోవైపు తమకు ఆదుకోవాలని ఆ దేశ క్రికెట్ బోర్డును రుణం అడిగినా కూడా ఫలితం లేకపోయింది. ఈ దశలో దిగ్గజ ఆటగాడు షహబాజ్ అహ్మద్ చొరవతో ఆ జట్టుకు స్పాన్సర్షిప్తో పాటు పాత బకాయిలు తీర్చేందుకు అవకాశం లభించింది. మరోవైపు తమకు సాయం అందించాలంటూ పాక్ హాకీ సమాఖ్య చేసిన విజ్ఞప్తికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం పట్టించుకోక పోవడం విశేషం.
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు
హాకీ వరల్డ్ కప్కు భువనేశ్వర్లోని కలింగ అంతర్జాతీయ హాకీ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొనున్నాయి. నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఈ హాకీ వరల్డ్ కప్ కోసం భారత హాకీ జట్లు(పురుషులు, మహిళలు) ఇప్పటికే పూర్తిగా సన్నద్ధమయ్యాయి. నవంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే పురుషుల హాకీ వరల్డ్కప్ డిసెంబర్ 16తో ముగియనున్నాయి. ఈ టోర్నీలో పురుషుల హాకీ జట్టు టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.