హైదరాబాద్: 2010లో జరిగిన 2022 ఫిఫా వరల్డ్ కప్ బిడ్డింగ్లో ఖతార్ విజయం సాధించింది. అయితే, ఈ బిడ్డింగ్లో గెలిచేందుకు గాను ఖతార్ స్మెర్ క్యాంపెయిన్ను నిర్వహించిందంటూ సండేటైమ్స్ పత్రికలో వెలువడిన కథనంపై ఖతార్కు చెందిన ఫిఫా సుప్రీం కమిటీ మండిపడింది.
తాజాగా, ఈ స్మెర్ క్యాంపెయిన్కు సంబంధించిన పత్రాలు వెలుగులకి వచ్చాయి. ఈ వరల్డ్కప్ నిర్వహణకు ఖతార్తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్లు పోటీపడ్డాయి. అమెరికా నుంచి పోటీని ఎదుర్కొనేందుకు ఖతార్ అమెరికాకు చెందిన పబ్లిక్ రిలేషన్స్ సంస్థ బీఎల్జేను నియమించుకొంది.
అంతేకాదు బిడ్డింగ్లో పాల్గొనే ప్రత్యర్థి దేశాలకు సంబంధించిన వ్యక్తులను 'మేనేజ్' చేసేందుకు మాజీ సీఐఏ ఏజెంట్ను కూడా నియమించుకొంది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రత్యర్థి దేశాల్లో ఫిఫా వరల్డ్కప్ నిర్వహణపై వ్యతిరేకత వచ్చేలా వీరు ప్రచారం చేశారనేది పత్రాల్లో వెలుగు చూసిన విషయం.
ఎలా బయటపడింది?
2022 ఫిఫా వరల్డ్ కప్ బిడ్డింగ్ ప్రక్రియలో పనిచేసిన ఒకరు సండేటైమ్స్కు ఈ పత్రాలకు సంబంధించి మెయిల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను ఖతార్ కొట్టిపారేసింది. నిజానికి ఇలాంటి క్యాంపెయిన్లు నిర్వహించడం ఫిఫా నిబంధనలను విరుద్ధం. దీంతో ఫిఫా దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో ఖతార్ కమిటీని నిర్దోషులుగా తేల్చింది.
بيان للجنة العليا للمشاريع والإرث
— Road to 2022 (@roadto2022) July 29, 2018
Official statement for Supreme Committee for Delivery & Legacy pic.twitter.com/wrOp97mn4v
పత్రాల్లో వెలుగు చూసిన విషయాలు:
ఇదిలా ఉంటే, 2022 వరల్డ్ కప్ నిర్వహణను దక్కించుకోలేకపోయిన అమెరికా... 2026 ఫిఫా వరల్డ్కప్ కోసం నిర్వహించిన బిడ్డింగ్లో విజయం సాధించింది. కెనడా, మెక్సికో దేశాలతో కలిసి 2026లో జరగనున్న ఫిఫా వరల్డ్కప్కు అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనుంది.