
హైదరాబాద్: రోమా జట్టుతో 1-4తేడాతో ఓడిపోయి కూడా ఏం ముంచుకుపోలేదు. మళ్లీ గెలుస్తామనే ధీమాని వ్యక్తం చేస్తున్నాడు బార్సిలోనా ఆటగాడు ఇవాన్ రాకిటిక్. బుధవారం ఇరుజట్లు మధ్య జరిగిన హోరాహోరీ క్వార్టర్స్ ఫైనల్ పోరులో రోమా జట్టు పరాజయం పాలైంది. బార్సిలోనా జట్టు చేసిన గోల్స్ నాలిగింటిలో రెండింటిని నిరోధించేవారు లేకుండానే చేసేసింది. అనంతరం గోల్స్ నిరోధించే ప్రయత్నంలో బార్సిలోనా తీవ్రంగా కష్టపడినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఆఖరి 10నిమిషాల ముందు కూడా రోమా జట్టు నాలుగో గోల్ను కూడా పూర్తి చేసింది. గేమ్ ఆరంభంలో అంతే ఉత్సాహం చూపించి ఉంటే అంత సులువుగా పాయింట్లు గెలుచుకునేది కాదు. ఆ రెండు గోల్స్ కోల్పోయిన తర్వాత తెలిసొచ్చింది బార్సిలోనా జట్టుకు అసలు సంగతి. కానీ, ఏ లాభం లేకుండా పోయింది. ఎంతో శ్రమించి ఆడితే ఒకే ఒక్క గోల్ దక్కింది.
ఈ నేపథ్యంలో మిడ్ ఫీల్డర్ ఇవాన్ రాక్టిక్ మాట్లాడుతూ.. 'ఇటలీలో ఆడుతున్నంతసేపు చాలా ఒత్తిడికి లోనయ్యాం. సెమీస్కు అర్హత సాధించాల్సిన మేము. కొద్దిగా నిదానించుకుని ఆడాల్సింది. ఇదే మొదటి మ్యాచ్ అనుకుని మైదానంలో అడుగుపెట్టినట్లైతే బాగానే స్కోరు చేసేవాళ్లం. కానీ, భారీ అంచనాలతో ఆట మొదలుపెట్టాం. అందుకే తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాం.' అని తెలిపాడు.
ఇంకా మాట్లాడుతూ,.. ఆ జట్టు గెలిచిందంటే ఆశ్చర్యపడాల్సినంత విషయమేం లేదు. అన్ని విధాల కుదురుకున్న జట్టు కాబట్టి గెలిచిందంతే. ఇదే ఛాంపియన్ లీగ్లో ఇలాంటి బలమైన జట్లతో ఇంకా పోటీ పడాల్సి ఉంది. మేం దానికి సిద్ధమవుతున్నాం. మరో సారి అవకాశం వస్తే మాత్రం వదులుకోవు. దానికి తగ్గట్లే బదులుచెప్తాం' అని పేర్కొన్నాడు.