For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2011 తర్వాత మళ్లీ ఆసియాకప్‌కు భారత్‌ అర్హత

ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ 2019 ఫుట్‌బాల్‌ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. బుధవారం క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో భాగంగా మకావుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ 2019 ఫుట్‌బాల్‌ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. బుధవారం క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో భాగంగా మకావుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో విజయం సాధించింది. భారత్‌ తరఫున రోలిన్‌ బోర్జెస్‌ (28వ), సునీల్‌ ఛెత్రి (60వ), జెజె లల్పెక్లువా (90వ నిమిషంలో) తలో గోల్‌ చేశారు.

ఈ మ్యాచ్‌లో సొంత గోల్ చేసుకున్న మకావు

ఈ మ్యాచ్‌లో మకావు ఒక సొంత గోల్‌ చేసుకుంది. 70వ నిమిషంలో ఆటగాడు లామ్‌ కా సెంగ్‌ సెల్ఫ్‌ గోల్‌ సాధించాడు. 37వ నిమిషంలో నికొలస్‌ తరావు మకావుకు తొలి గోల్‌ అందించాడు.

మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే

ఈ విజయంతో అర్హత పోటీల్లో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే భారత్‌ ఆసియాకప్‌లో స్ధానం దక్కించుకుంది. 2019 ఆసియా కప్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతుంది. 2011 తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌ మరోసారి అర్హత సాధించింది.

గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో

అంతకముందు భారత్ 1964, 1984, 2011లో ఆసియాకప్‌లో ఆడింది. మొదటిసారి రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు.. ఆ తర్వాత రెండు సార్లు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్‌-ఏలో నాలుగు మ్యాచ్‌ల నుంచి 12 పాయింట్లు సాధించిన భారత్‌, గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 నవంబరు 24న మయన్మార్‌తో

నవంబరు 24న మయన్మార్‌తో

ఇంతకుముందు మయన్మార్‌పై 1-0తో, కిర్గిజ్‌స్తాన్‌పై 2-0తో విజయం సాధించిది. భారత్‌ తన మిగతా రెండు మ్యాచ్‌ల్లో నవంబరు 24న మయన్మార్‌తో, మార్చి 27న కిర్గిజ్‌స్తాన్‌తో తలపడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+