హైదరాబాద్: బార్సిలోనా జట్టు తరపును ఆడుతున్న లియోనల్ మెస్సీ క్రిస్టమస్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రత్యర్థి తనకు పోటీదారుడు అయిన రియల్ మాడ్రిడ్ జట్టును ఓడించి ఆ ఆనందంలో క్రిస్టమస్ పండుగ చేసుకుంటానంటున్నాడు.
లా లీగ్ పట్టికలో ఇప్పటివరకు పదకొండు పాయింట్లతో లీడ్లో ఉన్న బార్సిలోనా జట్టు (42) మాడ్రిడ్ జట్టును(31)ను టార్గెట్ చేసింది. రెండో స్థానంలో ఉన్న బార్సిలోనా జట్టు ఆరు పాయింట్లు గెలిచి మొదటి స్థానంలో కూర్చొంది. అయినా సరిపెట్టుకోవడం లేదు. తనకు ప్రధాన పోటీదారుడైన క్రిస్టియన్ రొనాల్డో జట్టును ప్రధాన లక్షయంగా చేసుకుంది.
బహుశా ఈ పంతం క్రిస్టియన్ రొనాల్డోకు వచ్చిన ఐదో బాల్లోన్ డీ ఆర్ అవార్డు వల్ల కావచ్చు. డిసెంబరు ఏడో తేదీన ప్రకటించిన పేర్లలో ఆ పతకం రొనాల్డోను వరించిన సంగతి తెలిసిందే. మైదానంలో ఉన్న రియల్ మాడ్రిడ్ జట్టును ఓడించడం అదొక ఆనందమైన అనుభూతి అని మెస్సీ పేర్కొన్నాడు.
2016-17కు గాను స్పానిష్ వార్తపత్రిక మార్కా ప్రకటించిన పేర్లలో ఎంపికైన మెస్సీ పిచిచి, ఆల్ ఫ్రెడో డి స్టెఫానో ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఓడించడానికి ఇంకా మున్ముందు చాలా మ్యాచ్లు ఆడొచ్చు. కానీ, ఇప్పుడు ఓడిస్తే క్రిస్టమస్ హ్యాపీనెస్ ఇంకా ఎక్కువగా దొరకుతుందని తన ఉత్సాహాన్ని వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో మాట్లాడాడు.
తను స్పెయిన్తో ఫైనల్ మ్యాచ్ జరగడం అనేది ఓ కలగానే భావిస్తానని అన్నాడు. ఎందుకంటే 2014లో జర్మనీతో తలపడిన మ్యాచ్లో ఘోరంగా 1-0తేడాతో ఓడిపోయిందంటూ నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ప్రపంచ కప్కు ఆడటమనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలంటూ అభిప్రాయపడ్డాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.