ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ భగ్గుమంటోంది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో సోమవారం మొదలైన ఘర్షణలు ఈ రోజుకీ తగ్గుముఖం పట్టలేదు. ఈ హింసాత్మక ఘటనలపై భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటం దురదృష్టకరమని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేసారు.
కెప్టెన్గా స్టీవ్ స్మిత్.. నిషేధం తర్వాత ఇదే తొలిసారి!!
What is happening in Delhi is unfortunate. My request to all of you is to keep calm and peace in Delhi. Any injury or harm to anyone is a blot on the capital of this great country. I wish peace and sanity to one and all.
— Virender Sehwag (@virendersehwag) February 25, 2020
'డిల్లీలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటం ఎంతో దురదృష్టకరం. రాజధాని ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఢిల్లీలో ఎవరికి గాయమైనా అది గొప్ప భారతదేశ రాజధానికే మాయని మచ్చ అవుతుంది. ప్రతి ఒక్కరూ శాంతి స్థాపనకు కృషి చేయాలి' అని సెహ్వాగ్ కోరాడు.
What’s going on in Delhi is heart breaking, requesting everyone to please maintain peace and harmony. Hoping the authorities will take corrective measures to curb the situations. End of the day we are all humans, we need to love and respect each other 🙏 #DelhiBurning
— yuvraj singh (@YUVSTRONG12) February 26, 2020
'ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు బాధాకరం. దయచేసి అందరూ శాంతి, సామరస్యంతో ఉండాలని కోరుతున్నా. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. మనమంతా మనుషులమే. మనమంతా ఇతరుల పట్ల ప్రేమ, గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది' యువీ పేర్కొన్నాడు.
Apne hi apno ko kyu mar rahe hai ??? Requesting everyone to plz not hurt each other’s 🙏🙏🙏🛑🛑🛑 https://t.co/YD6jd9mS5m
— Harbhajan Turbanator (@harbhajan_singh) February 25, 2020
'మన సొంత ప్రజలు ఎందుకు చనిపోతున్నారు. ఎవరికీ బాధ కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నా' అని హర్భజన్ ట్వీట్ చేసాడు. ఈశాన్య డిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. ఆందోళనల్లో దాదాపు 200 మంది గాయపడ్డారు. వీరిలో 48 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఘర్షణల్లో ఇప్పటికే హెడ్ కానిస్టేబుల్ రతన్లాల్ మృతి చెందగా.. మంగళవారం రాత్రి ఇంటలెజిన్స్ విభాగం కానిస్టేబుల్ అంకిత్ శర్మ మృత్యువాత పడ్డారు.