|
అసహనం వ్యక్తం చేస్తోన్న భారత అభిమానులు
లీగ్ స్టేజిలో జరిగిన ఆఖరి మ్యాచ్లో మూడు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టును పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి గ్రూప్-బీ టాపర్గా నిలిచింది. అయితే, ఇంగ్లాండ్తో జరిగిన సెమీపైనల్లో మాత్రం భారత మహిళల జట్టు కనీసం పోరాటపటిమను కూడా ప్రదర్శించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ టీమ్ మేనేజ్మెంట్పై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
|
మిథాలీ రాజ్ను ఈ మ్యాచ్లో పక్కనబెట్టడంపై
ముఖ్యంగా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ను ఈ మ్యాచ్లో పక్కనబెట్టడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ టోర్నీలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో సూపర్ ఫామ్లో ఉన్న మిథాలీ రాజ్ని రిజర్వ్ బెంచ్కు పరిమితం చేయడం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయం కారణంగానే మ్యాచ్ చేజారిందని సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత మహిళల జట్టు ఎనిమిద వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ స్కివర్ (52), జోన్స్ (53) హాఫ్ సెంచరీలతో చెలరగడంతో మరో 17 బంతులు మిగిలుండగానే విజయం సాధించారు.
|
ఐసీసీ
ఐసీసీ మహిళల వరల్డ్ టీ20 పైనల్కు చేరిన ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ తన ట్విట్టర్లో అభినందనలు తెలిపింది.