|
దక్షిణాఫ్రికా సిరీస్కు అందుబాటులోకి షమీ
ఇకపోతే షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ఆసీస్ సిరీస్ కోసం భారత జట్టులో చేరిన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. అయితే దాదాపు ఉమేష్ చోటు ఖాయమైందని విశ్వసనీయ సమాచారం. ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన వెంటనే భారత్లో జరిగే దక్షిణాఫ్రికా టూర్లో మహ్మద్ షమీ తిరిగి ఆడనున్నాడు.
అంతలోపు క్వారంటైన్, ఐసోలేషన్ తదితర నిబంధనలు ముగుస్తాయి. ఇక షమీని టీ20 ప్రపంచకప్ ముందు జట్టు లైనప్లో భాగం చేయాలని.. హర్షల్ పటేల్ గానీ, బుమ్రా గానీ పూర్తి ఫిట్ నెస్ అందుకోకున్నా.. లేక గాయపడ్డ షమీని రిజర్వ్ ప్లేయర్గా ఉంచి జట్టును బలోపేతంగానే ఉంచుకోవాలని సెలెక్షన్ కమిటీ భావించింది.
|
వీళ్లంతా ఉండగా.. ఉమేష్ ఎందుకో?
ఇకపోతే ఆస్ట్రేలియా సిరీస్కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, దీపక్ చాహర్ ఉన్నారు. షమీ మిస్సవ్వడంతో ఉమేష్ యాదవ్ జట్టులోకి రాబోతున్నాడు. అర్షదీప్కు ఈ సిరీస్ విశ్రాంతినిచ్చారు. అవేశ్ ఖాన్ పెద్దగా రాణించడం లేదు. ఈ తరుణంలో భారత్కు మంచి పేస్ ఆప్షన్ అయిన మహమ్మద్ సిరాజ్నే జట్టులోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా ఉమేష్ తెరమీదకి వచ్చాడు. ఇక నెటిజన్లను సిరాజ్ను పక్కనపెట్టడం పట్ల సీరియస్ అయ్యారు. అసలే సోయిలో లేని ఉమేష్ యాదవ్ బీసీసీఐకి గుర్తుకొచ్చాడు కానీ సిరాజ్ ఎందుకు గుర్తురాలేదో అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల సిరాజ్ కౌంటీల్లో 5వికెట్ల హాల్ కూడా సాధించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మనే సిరాజ్ను పక్కనపెట్టడానికి కారణమంటూ కొందరు ఆరోపించారు. ఇంకొందరు అయితే మోహ్సిన్ ఖాన్, నటరాజన్, ఖలీల్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్ వీళ్లందరిని పక్కన పెట్టి ఉమేష్ను సెలెక్ట్ చేయడమేంటో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశారు.
|
ఆస్ట్రేలియా సిరీస్కు ఇండియా జట్టు
ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్(షమీ రిప్లేస్ మెంట్) , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా