హైదరాబాద్: దీపికాతో నో చెప్పి కోహ్లీ రూ.11కోట్ల నష్టానికి కారణమయ్యాడు. రాబోయే ఐపీఎల్ సీజన్లో భాగంగా విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు భారీ మొత్తంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సమయంలో ఆర్సీబీ జట్టు ప్రముఖ ట్రావెలింగ్ వెబ్సైట్ గోఐబీబోతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఈ చనువుతోనే గోఐబీబో కోహ్లీని దీపికాతో కలిసి ఒక యాడ్లో నటించమని కోరిందట. దానికి కోహ్లీ కుదరదని చెప్పడంతో ఆ సంస్థ నుంచి వచ్చే రూ. 11కోట్ల రూపాయలను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు నష్టపోయింది. ఇంతకీ కోహ్లీ నో చెప్పిన మరేదో కాదు. అది కూడా ఆర్సీబీ వల్లే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోహ్లీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్లోని ఓ క్లాజ్ ప్రకారం.. విరాట్ మరే ఇతర సెలబ్రిటీతో కలిసి నటించకూడదు. ఆ క్రమంలోనే దీపికా పదుకునేతో యాడ్ చేసేందుకు కోహ్లి నిరాకరించాడు.
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
కాగా, గోఐబిబో మాత్రం కోహ్లి కచ్చితంగా దీపికాతో కలిసి నటించాలని డిమాండ్ చేసింది. అది కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డీల్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆర్సీబీకి రూ. 11 కోట్ల నష్టం వచ్చింది.