హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన క్రికెట్ కెరీర్లో ఎంతో మంది ఆటగాళ్లను ఆట పట్టించిన సంగతి తెలిసిందే. అలాంటిది వీరేంద్ర సెహ్వాగ్ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సరదాగా ఏడిపించాడట. ఈ విషయాన్ని సచినే స్వయంగా వెల్లడించాడు. ఈ సంఘటన 2003 వరల్డ్కప్లో చోటు చేసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా టూడే నిర్వహించిన సలామ్ క్రికెట్ 2019 కార్యక్రమంలో సచిన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 2003 వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
సెంచూరియన్ వేదికగా మార్చి1న జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య చేధనకు దిగిన సమయంలో సెహ్వాగ్ను తాను ఆటపట్టించినటన్లు సచిన్ తెలిపాడు. లంచ్ సమయంలో సచిన్ ఓ బౌల్ ఐస్ క్రీమ్తో పాటు అరటి పండు తిన్న అనంతరం మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సమయంలో సెహ్వాగ్ తనకు వద్దకు వచ్చి ఒపెనర్గా తనని తొలి బంతి ఆడమన్నాడని, అయితే, అందుకు తాను అంగీకరించలేదని చెప్పాడు.
సలామ్ క్రికెట్ 2019: సచిన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను పొగొట్టినవేళ!
ఈ మ్యాచ్లో సెహ్వాగ్ 14 బంతుల్లో 21, సచిన్ 98 పరుగులు చేయడంతో టీమిండియా మరో 26 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.