రెండో టెస్టులో క్రమశిక్షణ తప్పిన స్టువర్ట్ లా
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో స్టువర్ట్ లా క్రమశిక్షణ తప్పాడు. టీవీ అంపైర్ రూములోకి వెళ్లడంతో పాటు ఫోర్త్ అంపైర్పైనా అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై విచారించిన ఐసీసీ తాజాగా తీర్పుని ప్రకటించింది. దీంతో.. అక్టోబరు 21, 24న జరిగే వన్డేలకి కోచ్ దూరం కానున్నాడు.
|
3 డీమెరిట్ పాయింట్లని చేర్చిన ఐసీసీ
క్రమశిక్షణ తప్పిన స్టువర్ట్ లాకి 100 శాతం మ్యాచ్ ఫీజుని జరిమానాగా విధించడంతో అతని ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లని కూడా ఐసీసీ చేర్చింది. అయితే.. అతని ఖాతాలో అప్పటికే ఒక డీమెరిట్ పాయింట్ ఉండటం.. రెండేళ్లలోపు అవి నాలుగుకి మించడంతో.. రెండు మ్యాచ్ల వేటు తప్పలేదు. 2017, మే నెలలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఇలానే క్రమశిక్షణ తప్పి.. 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా చెల్లించుకోవడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
అది పోయేదాకా రిటైర్మెంట్ ఆలోచనే లేదు: గంభీర్
బంతిని అంచనా వేయడంలో తడబడి
ఉప్పల్ టెస్టులో భారత స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఓపెనర్ కీరన్ పొవెల్ స్లిప్లో క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. అయితే.. స్లిప్లో రహానె క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలని తాకిందనే అనుమానం రావడంతో ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్కి నివేదించగా.. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు.
స్టువర్ట్ లా.. టీవీ అంపైర్ రూములోకి:
దీంతో.. కోపద్రిక్తుడైన స్టువర్ట్ లా.. నేరుగా టీవీ అంపైర్ రూములోకి వెళ్లాడు. అనంతరం ఫోర్త్ అంపైర్ సమీపంలోనూ నిల్చొని అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. అంపైర్ల ఫిర్యాదు మేరకు మ్యాచ్ రిఫరీ విచారణ జరిపి ఐసీసీకి నివేదించాడు.