జట్టు ప్రకటన అనంతరం
జట్టు ప్రకటన అనంతరం టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ వరల్డ్కప్కు ఎంపిక చేసే 18 మంది ఆటగాళ్ల పనిభారాన్ని పర్యవేక్షిస్తామని వెల్లడించాడు. ఈ విషయంపై బీసీసీఐ.. ఆయా ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతున్నదని అన్నాడు. వరల్డ్కప్కు ముందు ఆటగాళ్లు గాయపడకుండా ఉండాలంటే వాళ్లపై పని భారాన్ని తగ్గించాలని అన్నాడు.
ఎమ్మెస్కే మాట్లాడుతూ
ఎమ్మెస్కే మాట్లాడుతూ "వరల్డ్కప్ కోసం మేం 18 మందితో కుదించిన జాబితాను రూపొందిస్తాం. ఐపీఎల్లో వాళ్లను రొటేషన్ పద్ధతిలో ఆడిస్తాం. వారిలో నుంచి మెగా ఈవెంట్ కోసం జట్టును సిద్ధం చేస్తాం. పని భారాన్ని ఎలా పంచుకోవాలన్న దానిపై ఓ ప్రణాళికను రూపొందిస్తాం. రాబోయే రోజుల్లో దీనిపై సమగ్రంగా చర్చ జరిపి అన్ని విషయాలను వెల్లడిస్తాం" అని అన్నాడు.
స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి
"అయితే స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంగీకరిస్తాయా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రశ్నకు గాను బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ "ఈ విషయంపై ఫ్రాంచైజీలు కూడా ఆందోళనలోనే ఉన్నాయి. కానీ వాళ్లను ఒప్పించేలా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది వరల్డ్కప్ ఏడాది" అని అన్నారు.
ఫ్రాంచైజీలు దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలి
"కొన్ని ఫ్రాంచైజీలు వాళ్ల సమస్యలను కూడా చెబుతున్నాయి. వాటిని బహిర్గతం చేయదల్చుకోలేదు. ఏదేమైనా ఫ్రాంచైజీలు దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్రాంచైజీలన్నీ భారత్కు చెందినవే అనే విషయాన్ని కూడా మరువొద్దు. అంతర్జాతీయ స్థాయిలో మన జట్టు మెరుగ్గా ఆడితే అందరికీ బాగుంటుంది" అని అమితాబ్ చౌధరి వ్యాఖ్యానించాడు.