|
ఓడినా ఈ సిరీస్ హోరాహోరిగా సాగింది
"ఓడినా ఈ సిరీస్ హోరాహోరిగా సాగింది. ఇంగ్లండ్ కూడా మా కంటే మెరుగ్గా రాణించింది. అసలైన టెస్ట్ క్రికెట్ మజాను ఈ సిరీస్ అందించింది. రాహుల్, పంత్ల బ్యాటింగ్ అద్భుతం. పంత్ పోరాటపటిమ ఆకట్టుకుంది. అతనిపై మాకు నమ్మకం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్ భవిష్యత్తు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
శామ్ కర్రన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు అర్హుడు
"ఇక శామ్ కర్రన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు అర్హుడు. మొదటి, నాలుగో టెస్ట్లో అతను ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కష్ట సమయాల్లో తన జట్టును ఆదుకున్నాడు. ఇరు జట్లు విజయం కోసం పోటీపడటంతో అభిమానుల మ్యాచ్ చూసేందుకు వచ్చారు" అని కోహ్లీ తెలిపాడు.
కుక్ కెరీర్ గొప్పగా సాగింది
ఇక, ఈ టెస్టు మ్యాచ్తో ఘనంగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ గురించి కోహ్లీ మాట్లాడుతూ "అతని కెరీర్ గొప్పగా సాగింది. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా" అని అన్నాడు. ఆఖరి టెస్టులో కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114) సెంచరీలతో గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించారు.
ఆరో వికెట్కు 204 పరుగుల భారీ భాగస్వామ్యం
ఒకానొక దశలో అనూహ్య ఫలితమూ వచ్చేలా కనిపించింది. ఆరో వికెట్కు 204 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ జోడీ ఆశలు రేకెత్తించింది. కీలక సమయంలో ఆదిల్ రషీద్ (2/63) చక్కటి బంతితో రాహుల్ను ఔట్ చేసి భారత్ ఆశలకు తెరదించాడు. ఆ వెంటనే పంత్నూ పెవిలియన్ పంపి ఆతిథ్య జట్టుకు విజయాన్ని అందించాడు. 17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 345 పరుగులకే ఆలౌటైంది.
ఆఖరి టెస్టులో 118 పరుగులతో ఓడిపోయిన టీమిండియా
దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (3/45), శామ్ కర్రన్ (2/23) రాణించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్ 4-1తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్లో బ్యాట్తో మెరిసిన కోహ్లీ కెప్టెన్సీలో విఫలమయ్యాడని, తుది జట్టు ఎంపికలో తడబడ్డాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.