|
హ్లీని ఔట్ చేసినప్పుడు విలియమ్స్ కూడా
ఆ పర్యటనలో విరాట్ కోహ్లీని ఔట్ చేసినప్పుడు విలియమ్స్ జేబులోంచి బుక్ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించాడు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇలా చేసినట్లు మ్యాచ్ అనంతరం కోహ్లీ వెల్లడించాడు. కోహ్లీ.. బుక్ తీసి టిక్ కొట్టినట్లు సెలబ్రేషన్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కోహ్లీ 94 నాటౌట్
ఈ మ్యాచ్లో కోహ్లీ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది.
|
1-0 ఆధిక్యంలో టీమిండియా
ఫలితంగా మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డులతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కిపైగా స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 68 ఇన్నింగ్స్లాడిన కోహ్లీ 23 సార్లు 50కిపైగా స్కోరు చేశాడు.
|
కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (22) కొనసాగుతున్నాడు. దీంతో పాటు కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్'లు గెలుచుకున్న ఆటగాడిగా అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ (12 సార్లు) రికార్డును సమం చేశాడు. ఆ తర్వాతి స్థానంలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ (11) ఉన్నాడు.