అవకాశాలు ఇవ్వాలి:
ఆదివారం శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడాడు. 'నిజంగా ప్రతిభావంతుడైన ఆటగాడు నిరూపించుకోవడానికి, పరిస్థితులకు అలవాటు పడటానికి తగినన్ని అవకాశాలివ్వాలి. ప్రతిసారి జట్టులోకి వస్తూ పోతూ ఉంటే ఆటగాడి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. జట్టులోకి ఎంపిక కానప్పుడు కొన్నిసార్లు ఆటగాడు సహనం కోల్పోవచ్చు. కానీ.. ఎంపిక మన చేతుల్లో ఉండదు. మెరుగైన ప్రదర్శన చేయడం మాత్రమే ఆటగాడి చేతుల్లో ఉంటుంది' అని అయ్యర్ తెలిపాడు.
ఆటను ఆస్వాదిస్తూనే ఉండాలి:
'పతి ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేస్తూనే ఉండాలి. అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడే సత్తా ఉందని చాటుకుంటూనే ఉండాలి. అప్పుడే సెలక్టర్లు మనను గుర్తిస్తారు. ఎప్పుడు కూడా ఆటను ఆస్వాదిస్తూనే ఉండాలి. తాను అలానే చేసా' అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. 'భారత్ ఏ పర్యటన తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఉపయోగపడింది. విండీస్ పర్యటనలో రాణిస్తానని' ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ 6 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు ఆడాడు.
ప్రపంచకప్లో ఆడతా:
'నిలకడగా రాణిస్తుండడంతో ప్రపంచకప్కు ముందు నాపై చర్చ జరిగింది. ఆ ప్రదర్శన భారత్కు ఆడేటప్పుడు తప్పక ఉపయోగపడుతుంది. ప్రపంచకప్కు ఎంపిక కావడం కష్టం. కానీ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కపోవడం బాధించింది. దేశం తరపున ప్రపంచకప్లో ఆడడం నా కల. నాకు కొన్ని అవకాశాలు ఉన్నాయని తెలుసు. కానీ.. దురదృష్టవశాత్తు ఆ జట్టు కూర్పులో నా అవసరం లేకపోయింది. భవిష్యత్తులో తప్పక ప్రపంచకప్లో ఆడతా' అని అయ్యర్ ధీమా వ్యక్తం చేసాడు.