నో ధావన్, అయ్యర్..
మరోవైపు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు సైతం తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా క్రిక్బజ్తో మాట్లాడిన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ పేసర్ ఆశీష్ నెహ్రాలు ప్రపంచకప్ బరిలో దిగే భారత తుది జట్టును అంచనా వేసారు. శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్కు చోటు కల్పించిన ఈ దిగ్గజాలు.. జట్టులో రెగ్యూలర్ ఆటగాడైన శ్రేయస్ అయ్యర్ను విస్మరించారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ను పక్కనపెట్టారు.
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్
ఓపెనర్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎంపిక చేసిన సెహ్వాగ్, నెహ్రా.. ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్గా కేఎల్ రాహుల్కు అవకాశమిచ్చారు. నాలుగో స్థానంలో విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్ను.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశారు. పరిమిత ఓవర్ల సిరీస్లో సూర్య అదరగొడుతున్న విషయం తెలిసిందే. దాంతోనే సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లను పక్కనపెట్టి మరి సూర్యకు అవకాశమిస్తారని తెలిపారు.
సుందర్కు చోటు..
ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లను తీసుకున్నారు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా నిరాశపరుస్తున్నా.. అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం కారణంగానే చోటు దక్కించుకుంటాడని తెలిపారు. జడేజా అన్ని విభాగాల్లో రాణిస్తాడని, సుందర్ కారణంగా బౌలింగ్లో డెప్త్ ఉంటుందన్నారు. అతను చాలా కట్టడిగా బౌలింగ్ చేస్తాడని చెప్పారు. ఏకైక స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్కు చోటు దక్కుతుందన్నసెహ్వాగ్, నెహ్రా.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లను ప్రధాన పేసర్లుగా ఎంచుకున్నారు. ఇటీవల ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన దీపక్ చాహర్ను సైతం విస్మరించారు.
సెహ్వాగ్, నెహ్రా టీ20 ప్రపంచకప్ టీమ్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్