|
కోహ్లీతో పాటు ధావన్, రాహుల్లు కూడా
కోహ్లీతో పాటు ధావన్, రాహుల్లు కూడా కొంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలర్ బుమ్రా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం. బుధవారం ఆరంభమయ్యే టీ20 సిరీస్లో తాము కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లి మీద దృష్టిపెడితే సరిపోదని ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్ నాథన్ కౌల్టర్నైల్ అన్నాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మ సైతం ప్రమాదకర ఆటగాడే అని చెప్పాడు.
మరోసారి అదే తరహాలో దెబ్బ తీసేందుకు
‘రోహిత్ నమ్మశక్యం కాని ఆటగాడు. అతనేంటో తన రికార్డులతోనే చాటి చెప్తూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాడు. గతంలో అతడిపై మేం బాగానే విజయవంతమైయ్యాం. కొత్త బంతితో ఇబ్బంది పెట్టాం. చివరగా మాతో ఆడినపుడు బెరెన్డార్ఫ్.. రోహిత్ను ఔట్ చేశాడు. మరోసారి అదే తరహాలో అతడిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని కౌల్టర్నైల్ అన్నాడు.
బాల్ టాంపరింగ్.. ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బే
ఆస్ట్రేలియాలో గెలవడానికి ఇంతకంటే మంచి తరుణం మరోటి లేదన్నది మాజీలు, విశ్లేషకుల మాట. ప్రస్తుతమున్నంత బలహీనంగా కంగారూ జట్టు గతంలో ఎప్పుడూ లేదు. ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పేలవ దశ నడుస్తోందిప్పుడు. ఈ ఏడాది ఆరంభంలో బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్ను గట్టి దెబ్బే తీసింది. స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై నిషేధం పడటంతో జట్టు బలహీనపడింది. టాంపరింగ్ వివాదం మొత్తం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.
భారత్ను ఓడించి తిరిగి ఫామ్ అందుకోవాలని
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేయలేం. తమ గడ్డపై సరైన రికార్డు లేని భారత్ను ఓడించి తిరిగి ఫామ్ అందుకోవాలని ఆ జట్టు చూస్తోంది. వన్డే ప్రపంచకప్ తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఇదే సరైన సమయమని వేచి చూస్తోంది. సాధారణంగా ఆస్ట్రేలియాలో భారత పర్యటన టెస్టులతోనే మొదలవుతుంది కానీ.. ఈసారి కొంచెం భిన్నం. ముందు టీ20 సిరీస్ జరగనుంది. తర్వాత టెస్టులు ఆడి.. చివరగా వన్డే సిరీస్లో తలపడుతుంది టీమిండియా.