|
37 ఏళ్ల విరామం తర్వాత ఎంసీజీలో
మూడో టెస్టులో 137 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించి నాలుగు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. 37 ఏళ్ల విరామం తర్వాత ఎంసీజీలో నెగ్గిన భారత్కు మొత్తంగా ఇది 150 టెస్టు విజయం కావడం విశేషం. ఐదో రోజు ఆసీస్ ఇన్నింగ్స్ను ముగించడానికి భారత్ పెద్దగా శ్రమపడలేదు. మిగిలిన ఆ రెండు వికెట్లను 27 బంతుల్లోనే పడగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 258/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. 261 పరుగులకు ఆలౌటైంది. కమిన్స్ (63) వీరోచిత పోరాటానికి బుమ్రా తెరదించాడు. కమిన్స్ తొలి స్లిప్లో పుజారా చేతికి చిక్కగా.. తర్వాతి ఓవర్లోనే లైయన్ (7)ను ఇషాంత్ ఔట్ చేశాడు.
399 పరుగుల లక్ష్య ఛేదనలో
బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు చతేశ్వర్ పుజారా (106) 319 బంతుల్లో సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్ని 443/7తో డిక్లేర్ చేయగా.. అనంతరం ఆస్ట్రేలియా టీమ్ 151 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. దీంతో.. 292 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ని 106/8తో డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పాట్ కమిన్స్ (63) మినహా అందరూ తేలిపోయారు.
ఆసీస్ను కట్టడి చేస్తే సిరీస్ చేజిక్కినట్లే
ఇప్పటికే మ్యాచ్ విజయం సాధించి ఆధిక్యంతో ఉన్న టీమిండియా నాలుగో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ ఆఖరి టెస్టు సిడ్నీ వేదికగా జరగనుంది. ఇందులో ఆసీస్ను కట్టడి చేస్తే సిరీస్ చేజిక్కినట్లే. అడిలైడ్ వేదికగా, మెల్బౌర్న్ వేదికగా టీమిండియా గెలవగా, పెర్త్ స్టేడియంలో మాత్రం టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది.