మూడు ఫార్మాట్లలో 2735 పరుగులు చేసిన కోహ్లీ
ఈ ఏడాది మూడు ఫార్మాట్లూ కలుపుకొని కోహ్లీ 2735 పరుగులు చేశాడు. అయితే, మూడు ఫార్మాట్లలో ఒక కేలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డుని మాత్రం అధిగమించలేకపోయాడు. 2005లో రికీ పాంటింగ్ మూడు ఫార్మాట్లలో 2833 పరుగులు చేశాడు.
విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా
ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలలో సత్తా చాటిన కోహ్లీ ఒక కేలండర్ ఇయర్లో విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. గత మూడేళ్లలో కోహ్లీ 8148 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు ఉండటం విశేషం.
కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దగ్గర నుంచి కోహ్లీ దూకుడు
కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో దూసుకుపోతున్నాడు. వాస్తవానికి ఈ ఏడాది మరిన్ని పరుగులు విరాట్ కోహ్లీ ఖాతాలో చేరేవే. విశ్రాంతి, వెన్నునొప్పి కారణంగా కోహ్లీ 13 మ్యాచ్లకు దూరమయ్యాడు. శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీకి విశ్రాంతి తీసుకున్న అప్ఘాన్తో జరిగిన ఏకైక టెస్టుకు కూడా దూరమయ్యాడు.
పాంటింగ్ రికార్డను అందుకోలేకపోయిన కోహ్లీ
ఆ తర్వాత ఆసియా కప్కు కూడా కోహ్లీ దూరం కావడంతో.. అతడి స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఆసియా కప్లో భారత జట్టుని టైటిల్ విజేతగా నిలబెట్టాడు. అదే, ఈ అన్ని మ్యాచ్ల్లోనూ ఆడి ఉంటే.. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డుని అధిగమించేవాడే.