|
సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ
ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై కోహ్లీ మూడు సెంచరీలు బాధిన సంగతి తెలిసిందే. 386 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. సచిన్కన్నా 40 ఇన్నింగ్స్లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో 36, టెస్టుల్లో 24 సెంచరీలతో ఉన్న ఈ విరాట్ కోహ్లీ మొత్తంగా 60 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (100), రికీ పాంటింగ్ (71), కుమార సంగక్కర (63), జాక్వస్ కలిస్ (62) ముందున్నారు.
కెప్టెన్గా 14 సెంచరీలు సాధించిన కోహ్లీ
గువహటి వన్డేలో కోహ్లీ సాధించిన సెంచరీ ఛేదనలో అతడికిది 22వ సెంచరీ కాగా స్వదేశంలో 15వది. ఇక, కెప్టెన్గా కోహ్లీ సాధించిన సెంచరీల సంఖ్య 14. 50 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ (22) తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు. పాంటింగ్ 220 ఇన్నింగ్స్ల్లో ఈ సెంచరీలు చేశాడు.
అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడు కోహ్లీ
300కి పైగా పరుగుల ఛేదనలో అత్యధిక సెంచరీలు (8) చేసిన తొలి ఆటగాడు కోహ్లీ. అలాగే వరుసగా మూడు కేలండర్ ఇయర్స్ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్, హేడెన్, రూట్ సరసన నిలిచాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీ-రోహిత్ శర్మల జోడీ అనేక రికార్డులను నమోదు చేసింది.
నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లీ-రోహిత్ జోడీ
వన్డేల్లో అత్యధిక సెంచరీల (15) భాగస్వామ్యాలు ఏర్పరచిన ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్ శర్మ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో సచిన్, గంగూలీ (26సార్లు) ఉన్నారు. ఛేదనలో రెండో వికెట్కు అత్యధిక పరుగుల (246) భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తొలి భారత జోడీ రోహిత్-కోహ్లీ నిలిచింది. ఓవరాల్గా ఛేదనలో ఇది రెండో అత్యధికం. ఈ జాబితాలో వాట్సన్, పాంటింగ్ (252) ముందున్నారు.
వన్డే ఛేదనల్లో ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమం
గువహటి వన్డేలో కోహ్లీ, రోహిత్ శర్మలు నెలకొల్పిన భాగస్వామ్యం 246 పరుగులు. భారత్ తరఫున వన్డే ఛేదనల్లో ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమం. 2009లో కోహ్లీ, గంభీర్ 224 పరుగులతో నెలకొల్పిన రికార్డు కనుమరుగైంది. ఇప్పటివరకు వన్డేల్లో కోహ్లీ, రోహిత్ శర్మ డబుల్ సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య 5. మరే జోడీ మూడుకు మించి డబుల్ సెంచరీలు సాధించలేదు.