రిషబ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్తో
ఈ మ్యాచ్కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విక్రమ్ రాథోర్... రిషబ్ పంత్ బ్యాటింగ్ టెక్నిక్తో పాటు టెస్టుల్లో ఓపెనర్గా రోహిత్ శర్మను బరిలోకి పంపే అవకాశాలపై స్పందించాడు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ టీ20 యావరేజి 21.57గా ఉంది. ఒకే తరహా షాట్కు ఔట్ కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ "పంత్ అన్ని షాట్లను ఆడాలని మేము కోరుకుంటున్నాం. అదే అతనికి ప్రత్యేకతను ఇస్తుంది. అతడు అద్భుతమైన ప్లేయర్... అదే సమయంలో అతడు అజాగ్రత్తగా ఉండకూడదు. జట్టులోని యువ క్రికెటర్లు అందరూ భయం లేకుండా ఆడటం.. అజాగ్రత్తగా ఉండటం మధ్య ఉన్న తేడా తెలిసుండాలి" అని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ ఎంపిక
అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం రోహిత్ శర్మను తిరిగి టెస్టులకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్తో కలిసి ఓపెనర్గా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. సొంతగడ్డపై ఓపెనర్గా రోహిత్ శర్మ రాణిస్తాడని.. మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్ క్రిస్ట్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓపెనర్గా రోహిత్ శర్మ
దీనిపై విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ "ఏ జట్టులోనూ ఆడకపోయినా రోహిత్ శర్మ చాలా మంచివాడు అనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఇదే అభిప్రాయంతో ఉంటారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రోహిత్ శర్మ అద్భుతమైన ఓపెనింగ్ బ్యాట్స్మన్. దీంతో అతడు టెస్టుల్లో విజయవంతం కాకపోవడానికి ఎటువంటి కారణం లేదు. రోహిత్ గనుక తన గేమ్ప్లాన్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే... జట్టుకు గొప్ప ఆస్తి అవుతాడు" అని అన్నాడు.