మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఆటగాడికి కరోనా
మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఆటగాడికి గతవారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. సోమవారం మాత్రం ఇద్దరికీ పాజిటివ్ అని తేలింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లను ఐసోలేషన్లో ఉంచారు. ఒకరితో మరొకరు కలవద్దని ఆదేశించారు. ఇరు జట్ల ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించిన తర్వాతే.. వారిని తదుపరి మ్యాచ్ ఆడేందుకు అనుమతిస్తారు. అయితే కరోనా సోకిన ఆటగాళ్ల పేర్లను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు.
బీహార్ ఆటగాడికి పాజిటివ్
ఇక బీహార్ ఆటగాడికి పాజిటివ్ రావడం ఇదే మొదటిసారి. బీహార్ సోమవారం కర్ణాటకతో మ్యాచ్ ఆడింది. దీంతో ఇరు జట్లను మంగళవారం పరీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం అందరూ ఐసోలేషన్లో ఉన్నారు. 'RT-PCR టెస్ట్ అయ్యే వరకు ఐసోలేషన్లో ఉండాలని బీసీసీఐ అధికారులు ఆదేశించారు' అని బీహార్ ఆటగాడు ఓ జాతీయ మీడియాతో చెప్పాడు. ప్రస్తుతం మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ జట్లు జైపూర్లో ఉండగా.. బీహార్ జట్టు బెంగళూరులో ఉంది.
ఇదే మొదటిసారి కాదు
దేశీయ క్రికెట్లో భారత క్రికెటర్లకు కరోనా సోకడం ఇదే మొదటిసారి కాదు. గతవారమే మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్కు ప్లేయర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఇరు జట్లలోని ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ జమ్ము కాశ్మీర్కు చెందిన ఓ క్రికెటర్కు కరోనా సోకింది. ఇక ఐపీఎల్ 2020 సందర్భంగా చాలా మందికి పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. అయితే అందరూ త్వరగా కోలుకోవడం సంతోషించాల్సిన విషయం. అన్ని టోర్నీలు బయో బబుల్ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే.
బయో బబుల్ వాతావరణంలోనే టెస్ట్ సిరీస్
మరోవైపు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మూడో మ్యాచ్ బుధవారం నుంచి అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంలో ప్రారంభం కానున్నది. డే/నైట్ టెస్ట్ కోసం టీమిండియా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్ బాల్తో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ కూడా బయో బబుల్ వాతావరణంలో జరుగుతుంది.
Day/night Test: పింక్బాల్ టెస్ట్ గెలిచి.. సిరీస్ను కైవసం చేసుకుంటాం: ఆర్చర్