
పునరాగమనం చేయాలనుంది
తాజాగా ఉమేష్ ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'మైదానం బయట కూర్చోవాలని మాత్రం ఎవరికి ఉంటుంది?. నేను కూడా మనిషినే. పరిమిత ఓవర్ల క్రికెట్లో మళ్లీ పునరాగమనం చేయాలనుంది. అందుకోసం చాలా కష్టపడుతున్నా. ఇక న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ కోసం ఎదురుచూస్తున్నా. కచ్చితంగా సెలెక్టర్లు నన్ను ఎంపిక చేస్తారనే నమ్మకం ఉంది. ఒకవేళ ఎంపికైతే.. వందశాతం కష్టపడతా. రాణిస్తాననే నమ్మకం ఉంది. నా లైన్ అండ్ లెంగ్త్పై చాలా కసరత్తు చేశా' అని తెలిపాడు.

బుమ్రా, షమీలతో మంచి అనుబంధం ఉంది
'జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మలతో మంచి అనుబంధం ఉంది. వారందరితో కలిసి ఆడటం గర్వంగా ఉంటది. మేమంతా 140 కిమీ వేగంతో బంతులు వేస్తాం. బాగా రాణిస్తూ వికెట్లు పడగొడుతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ ప్రదర్శన చేయగలం. అదే మమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఒకర్ని ఒకరు ప్రశంసించుకుంటాం. మా ఆలోచనలను పంచుకుంటాం. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంది' అని ఉమేష్ అన్నాడు.

2015 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు:
2015 ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉమేష్ నిలిచాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ లాంటి సీనియర్లు.. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ వంటి యువకులు వచ్చాక అతడికి అవకాశాలు తగ్గాయి. చివరగా ఉమేశ్ 2018లో వెస్టిండీస్పై వన్డే మ్యాచ్ ఆడాడు.

10 బంతుల్లోనే 31 పరుగులు:
ఇటీవలి కాలంలో ఉమేశ్ బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఉమేశ్ సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 10 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో అనేక రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. ఉమేశ్ ఇప్పటి వరకు భారత్ తరపున 45 టెస్టులు (142 వికెట్లు), 75 వన్డేలు (106 వికెట్లు), 7 టీ20 (9 వికెట్లు)లు ఆడాడు.


Click it and Unblock the Notifications












