ముగిసేసరికి 322 పరుగుల దూరంలో
పాట్ కమిన్స్.. పీటర్ హ్యాండ్స్కాంబ్ బ్యాటింగ్కు దిగారు. కాస్త విరామంలోనే 258 పరుగుల వద్ద వెంట వెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. 90వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి హాండ్స్కాంబ్(37) బౌల్డ్ అయ్యాడు. 91 ఓవర్లో కుల్దీప్ వేసిన బంతికి నాథన్ లయన్ పరుగులేమీ చేయకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. మొహమ్మద్ షమీ షార్ట్ డెలివరీ వేయడంతో కమిన్స్ 25 పరుగులకే అవుట్ అయ్యాడు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి 322 పరుగుల దూరంలో మాత్రమే నిలిచింది. 1988 తర్వాత మళ్లీ టీమిండియా ఫాలో ఆన్ ఇచ్చిన మ్యాచ్ అంటే ఇదే. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ను మధ్యలో ఆపేశాడు.
|
1988 తర్వాత తొలిసారి ఇలా
సొంతగడ్డపై ఆసీస్ ప్లేయర్లను టీమిండియా చిత్తుగా ఓడించింది. 1988 తర్వాత తొలిసారి ఇలా జరిగింది. కుల్దీప్ యాదవ్ ఛాంపియన్ ప్రదర్శన కట్టిపడేసింది. టీమిండియా గేమ్ గర్వకారణంగా అనిపించింది.
|
మీతో కలిసి పనిచేయడం ఆనందంగా
చాలా బాగా ఆడారు. ఐదు వికెట్లు పడగొట్టి కుల్దీప్ అభినందనలకు అర్హుడు. మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మా జట్టు ప్లేయర్లను అవుట్ చేసిన తీరు బాగా నచ్చింది.