భారత్ పతనాన్ని శాసించిన బౌల్ట్..
రెండు టెస్ట్లో సిరీస్లో బౌల్ట్ భారత్ పతనాన్ని శాసించాడు. గాయం తర్వాత ఈ సిరీస్తోనే రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ పేసర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 11 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌథీ(14) తొలి స్థానంలో నిలవగా బోల్ట్ రెండో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా బ్యాటింగ్లోను అదరగొట్టాడు. వెల్లింగ్టన్ టెస్ట్లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ ఆజాజ్ పటేల్(4) చివరి వికెట్కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
అందుకే కోహ్లీ విఫలం..
ఇక ఈ సిరీస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా తేలిపోవడానికి గల కారణాలను బౌల్ట్ చెప్పుకొచ్చాడు. ‘కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. మాకు అతడి వికెట్ ఎంతో కీలకం. అందుకే అతడిపై ఒత్తిడి పెరిగేలా ప్రయత్నించాం. లయ తప్పకుండా బంతులు వేస్తూ బౌండరీలు సాధించకుండా కట్టడి చేశాం. అంతేకాక అతడు పొరపాట్లు చేసేలా పురిగొల్పాం. మొత్తంగా అదృష్టవశాత్తు మంచి బంతులతో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాం. కోహ్లీ ఎంత తొందరగా పెవిలియన్కు చేరితే మాలో విశ్వాసం మరింత పెరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు.
నెమ్మదైన పిచ్లు..
ఇక భారత్లో నెమ్మదైన పిచ్లపై ఆడటం కూడా భారత జట్టుకు ప్రతికూలంగా మారిందన్నాడు. ‘భారత్లో వారు ఎక్కువగా నెమ్మది పిచ్లపై ఆడుతుంటారు. దీంతో ఇక్కడి పిచ్లపై అలవాటు పడాలంటే సమయం పడుతుంది. భారత్లో బౌలింగ్ చేయాలన్నా నాకు అలానే ఉంటుంది. అయితే రెండో రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. ఇది టెస్టు క్రికెట్లో రికార్డో కాదో నాకు తెలియదు. కానీ బౌలర్లు ఎంతో గొప్పగా బౌలింగ్ చేశారు. మొత్తంగా మేం రెండో టెస్టులో మెరుగైన స్థితిలో నిలిచాం'' అని బౌల్ట్ పేర్కొన్నాడు.