లేఖ బహిర్గతం కావడాన్ని బీసీసీఐ సీరియస్గా
అదంతా వివరిస్తూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) సబా కరీమ్కు మిథాలీ మెయిల్ రూపంలో సుదీర్ఘమైన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లేఖ బహిర్గతం కావడాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. మిథాలీ రాసిన ఈ-మెయిల్ లేఖ ఎలా లీక్ అయిందో వివరణ ఇవ్వాలంటూ జోహ్రీ, సబా కరీమ్కు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌధరి బుధవారం ఈ-మెయిల్ చేశారు.
మిథాలీ ఎవరెవరికి పంపిందోనని విచారణ
‘మీకు మిథాలీ లేఖ రాసిన ఈ-మెయిల్ సారాంశం బహిర్గతమైందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వస్తున్నాయి. సదరు మెయిల్ను మిథాలీ ఎవరెవరికి పంపిందో సదరు లేఖ కాపీలను తక్షణమే నాకు పంపండి' అని జోహ్రీ, సబా కరీమ్లకు పంపిన మెయిల్లో అమితాబ్ పేర్కొన్నాడు. ఈ ఉదంతంతో ఇప్పుడు కొందరు వ్యక్తులతో పాటు బీసీసీఐకి కూడా నష్టం వాటిల్లే ప్రమాదముందనీ.. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నట్టు కూడా అమితాబ్ ఆ మెయిల్లో కోరినట్టు సమాచారం.
మిథాలీకి వ్యక్తిగత రికార్డులే ముఖ్యం, జట్టును పట్టించుకోదు: రమేశ్ పొవార్
మిథాలిని తప్పించినందుకు వివరణ ఇస్తూ:
ఆ మెయిల్లో మిథాలీ చేసిన ప్రశ్నలకు ఆమె ఆవేదనకు కోచ్ రమేశ్ పవార్ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా.. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో మిథాలీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో పొవార్ బీసీసీఐకి వివరణ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో మిథాలీని తప్పించడంతో పాటు జట్టు గెలుపొటములకు సంబంధించిన నివేదికను కోచ్ పవార్ బీసీసీఐకి సమర్పించాడు. బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ, క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీంతో బుధవారం ముంబైలో సమావేశమైన రమేశ్.. 10 పేజీల నివేదికను అందజేశాడు.