2011: సచిన్ టెండూల్కర్ (నాగ్పూర్లో దక్షిణాఫ్రికాపై 111)
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు సచిన్ టెండూల్కర్(111), వీరేంద్ర సెహ్వాగ్(73) పరుగులతో భారత్కు చక్కటి శుభారంభాన్నిచ్చారు. సెహ్వాగ్ తొలి వికెట్గా పెవిలియన్కు చేరినప్పటికీ... ఆ తర్వాత గంభీర్(69)తో కలిసి సచిన్ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. దీంతో సచిన్ 101 బంతుల్లో 111 పరుగులు చేశాడు. సచిన్ ఔటైన తర్వాత కేవలం 29 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా 296 పరుగులకే పరిమితమైంది. అనంతరం 297 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన సఫారీలు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. ఈ మ్యాచ్లో 50/5 రాణించిన డేల్ స్టెయిన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో సచిన్ సెంచరీ వృధా అయింది.
2011: మహిళా జయవర్దనే(ముంబైలో టీమిండియాపై 103 నాటౌట్)
ఇది వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్. వాంఖడె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్మెన్ మహిళా జయవర్దనే 88 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేధనలో ఓపెనర్ గౌతమ్ గంభీర్(97), ధోని(91 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో జయవర్దనే సెంచరీ వృథా అయింది.
1992: అజహరుద్దీన్ (బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాపై 93)
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అలెన్ బోర్డర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ బ్యాట్స్మెన్లలో జోన్స్(90), బూన్(43) పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. అనంతరం భారత్ బ్యాటింగ్ ఆరంభించే సమయానికి వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షం తగ్గిన తర్వాత టీమిండియా విజయ లక్ష్యాన్ని 47 ఓవర్లకు గాను 236 పరుగులుగా నిర్ధారించారు. చేధనలో రవిశాస్త్రి(67 బంతుల్లో 25) పరుగులు మ్యాచ్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత అజహరుద్దీన్(102 బంతుల్లో 93) పరుగులతో దూకుడుగా ఆడినప్పటికీ జట్టుని గెలిపించలేకపోయాడు. 47 ఓవర్లకు గాను టీమిండియా 234 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఒక పరుగు తేడాతో ఆసీస్ నెగ్గింది. అయితే, అజహరుద్దీన్ ఇన్నింగ్స్ ఇప్పటికీ వరల్డ్కప్లో అత్యుత్తమ ఇన్నింగ్స్గా కొనియాడబడుతుంది.
2003: స్కాట్ స్టైరిస్ (శ్రీలంకపై 141)
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. సనత్ జయసూర్య (125 బంతుల్లో 120) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 272 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న న్యూజిలాండ్ను స్కాట్ స్టైరిస్ తన సెంచరీతో ఆదుకున్నాడు. No.4 స్థానంలో క్రీజులోకి వచ్చిన No.4 చివరి వరకు క్రీజులో నిలిచి 125 బంతుల్లో 141 పరుగులు చేసి న్యూజిలాండ్ను గెలిపించేంత పనిచేశాడు. అయితే, జట్టులోని మిగతా సభ్యుల నుంచి అతడికి సరైన సహకారం లభించకపోవడంతో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
1999: నైల్ జాన్సన్ (లార్డ్స్లో ఆస్ట్రేలియాపై 132 నాటౌట్)
చాలా మంది అభిమానులను ఈ మ్యాచ్ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ క్యాంప్బెల్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో మార్క్ వా(104), స్టీవ్ వా(62) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. అనంతరం చేధనలో జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో జాన్సన్ (144 బంతుల్లో 132) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన జాన్సన్ ఆఖరి ఓవర్ వరకు క్రీజులో నిలిచాడు. వరల్డ్కప్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ల్లో ఒకటిగా నిలిచింది.