కఠినమైన ఆసీస్ పిచ్లపై
"ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ క్లాస్ పేస్ ఎటాక్ ఉంది. అక్కడి కఠిన పిచ్లపై వారిని ఎదుర్కొంటూ పరుగులు చేయడం చాలా కష్టం. ఈ రోజులు ఆటగాళ్లంతా త్వరగా పరుగులు చేయడంపైనే దృష్టి సారిస్తున్నారు" అని శుభమాన్ గిల్ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో మొత్తం ఏడు ఇన్నింగ్స్లాడిన పుజారా 1,238 బంతులు ఎదుర్కొని 521 పరుగులు సాధించాడు.
మూడు సెంచరీలు చేసిన పుజారా
ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 193 పరుగులు చేసిన త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో పుజారా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ సిరిస్కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన ఓ టెస్టు సిరీస్లో ఇప్పటి వరకూ అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్గా రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉండగా తాజాగా ఆ రికార్డుని పుజారా అధిగమించాడు.
ద్రవిడ్ రికార్డు బద్దలు
2003-04లో జరిగిన ఆసీస్ పర్యటనలో ద్రవిడ్ 1,203 బంతులతో ఆ రికార్డ్ని నెలకొల్పగా.. పుజారా 1,258 బంతులతో దానిని బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో విజయ్ హజారే (1947-48) 1,192 బంతులతో ఉండగా.. విరాట్ కోహ్లీ (2014-15) 1,093 బంతులు, సునీల్ గవాస్కర్ (1977-78) 1,032 బంతులతో టాప్-5లో ఉన్నారు.
ఐదు మ్యాచుల్లో 720 పరుగులు
ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరిస్ను నెగ్గడంలో పుజారాదే కీలకపాత్ర. పుజారాతో పాటు భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. శుభమాన్ గిల్ రంజీల్లో ఐదు మ్యాచుల్లోనే దాదాపు 80 యావరేజితో 720 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.