హైదరాబాద్: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 11వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు నిర్వాహకులు బిజీ అయ్యారు. మరోవైపు ఆటగాళ్లు సైతం ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటూ చెమటోడ్చుతున్నారు.
టోర్నీలో భాగంగా ఐపీఎల్ తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, సమయాభావం వల్ల ఈ ఏడాది జరిగే ఐపీఎల్ ఆరంభ వేడుకలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరుకాని సంగతి తెలిసిందే.
📸The eight captains pose with the silverware as the VIVO #IPL is all set to commence in Mumbai tomorrow. pic.twitter.com/Zn3MDFjSnA
— IndianPremierLeague (@IPL) April 6, 2018
కొన్ని కారణాల వల్ల ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్లు తప్ప... మిగతా జట్లకు చెందిన కెప్టెన్లు ఆరంభ వేడుకల్లో పాల్గొనడం లేదని ఐపీఎల్ నిర్వాహకులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా
ఐపీఎల్ ట్రోఫీతో ఎనిమిది జట్ల కెప్టెన్లతో ఫొటో షూట్ నిర్వహించారు.
దీనికి సంబంధించిన ఫోటోలను ఐపీఎల్ అధికారిక ట్విటర్ పేజీలో అభిమానులతో పంచుకున్నారు. ఐపీఎల్ ట్రోఫీతో ఎనిమిది జట్లకు చెందిన కెప్లెన్లను ఒకేసారి చూడటంతో అభిమానులు సంతోషానికి గురయ్యారు. ఈ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
The eight VIVO #IPL captains sign the #TataNexon, which will be auctioned and the proceeds will be donated to Tata Cancer Trust, to help them create cancer awareness at a ground level for early detection. pic.twitter.com/mISryRCLV0
— IndianPremierLeague (@IPL) April 6, 2018