|
నాలుగో టెస్టులో స్మిత్ డబుల్ సెంచరీ
నాలుగో టెస్టులో స్మిత్ డబుల్ సెంచరీతో మెరవడంతో ఆస్ట్రేలియా తిరిగి యాషెస్ను కూడా నిలుపుకుంది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్పై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, ఇంగ్లాండ్ అభిమానులు మాత్రం అతడిని కొనియాడకపోగా... స్మిత్ ఎన్ని సెంచరీలు బాదినా... అతడిని మోసగాడిగానే పరిగణిస్తారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఒకరు అన్నారు.
|
ఏడు ఇన్నింగ్స్ల్లో 110.57 యావరేజితో 774 పరుగులు
అయితే, ఈ యాషెస్ సిరిస్లో స్మిత్ మొత్తం ఏడు ఇన్నింగ్స్ల్లో 110.57 యావరేజితో 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫలితంగా టెస్టుల్లో తిరిగి నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. యాషెస్లో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్లో స్మిత్ 23 పరుగులకే ఔటయ్యాడు.
చప్పట్లతో అభినందన
అయితే, ఈ యాషెస్ సిరిస్ మొత్తం అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్... ఆఖరి టెస్టులో మాత్రం అతడు మైదానాన్ని వీడుతున్నప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో అభినందించారు. నిషేధం తర్వాత తన రీఎంట్రీలో అద్భుత ప్రదర్శనకు గాను అభిమానుల సైతం మెచ్చుకున్నారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిరీస్ ఆద్యంతం వెనుకంజలోనే నిలిచిన ఇంగ్లండ్ ఎట్టకేలకు చివరి టెస్టులో ఘన విజయం సాధించి 2-2తో సమం చేసుకుంది. స్టువర్ట్ బ్రాడ్ (4/62) జాక్ లీచ్ (4/49) రాణించడంతో 135 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది.
2-2తో సిరిస్ సమం
399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. మథ్యూ వేడ్ (166 బంతుల్లో 117 ; 17ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ట్రోఫీని కోల్పోయినా.. ఆతిథ్య జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఐదు టెస్ట్ల సిరీస్ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది.