కోహ్లీతో పాటు
కెప్టెన్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ షైనీ, శ్రేయాస్ అయ్యర్లు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న జిమ్లో కాసేపు కసరత్తులు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా ఆటగాళ్లతో జతకలిశాడు. జిమ్లో వర్కౌట్లు చేస్తోన్న ఫోటోని ధావన్ ఇనిస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
|
స్వాడ్ గోల్స్' అంటూ ధావన్ కామెంట్
అంతేకాదు ఆ పోస్టుకు 'స్వాడ్ గోల్స్' అంటూ కామెంట్ కూడా పెట్టాడు. మరోవైపు నెట్ ప్రాక్టీస్లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీలో కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
|
ద్రవిడ్తో కోహ్లీ
మూడు టీ20ల సిరిస్లో భాగంగా టీమిండియా ఆదివారం మూడో టీ20లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.... మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అక్టోబర్ 2న తొలి టెస్టు
టీ20 సిరిస్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ జరగనుంది. తొలి టెస్టు అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ టెస్టు సిరిస్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా వ్వవహారిస్తోన్న రోహిత్ శర్మ... మయాంక్ అగర్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు.