|
ఓరి ఆజామూ..
నమ్మకంగా ఉండటమే కాదు.. తమ విశ్వవిజేతలం అంటూ ఇతర జట్లను అవహేళన చేశారు. ముఖ్యంగా ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిన తర్వాత 1992 సెంటిమెంట్ రిపీట్ అని, భారత జట్టు కంటే తమ జట్టు బలమైనదని ప్రగాల్భాలు పలికారు. కానీ ఫైనల్లో ఫలితం ప్రతికూలంగా రావడంతో భారత నెటిజన్లు పాకిస్థాన్ జట్టును సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓ ఆజామూ.. ఏమాయేరా? మీ 1992 సెంటిమెంట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఫన్నీ మీమ్స్తో నవ్వులు పూయిస్తున్నారు.
|
సెంటిమెంట్ లేదు.. గింటిమెంట్ లేదు!
1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగానే జరగడం, అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాక్ చేరుకోవడం ఆ జట్టు అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. దాంతో భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందే 1992 సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ఇంగ్లండ్ చేతిలో ఇండియా ఓడుతుందని పాక్ అభిమానులు జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి టైటిల్ ముద్దాడుతుందన్నారు. రెండు ఫైనల్లో కూడా పాక్ నోబాల్తోనే ఖాతా తెరిచిందని, ఫలితంలో కూడా మార్పు ఉండదని కూడా కామెంట్ చేశారు. కానీ బెన్ స్టోక్స్ పోరాటం ముందు ఈ సెంటిమెంట్ కొట్టుకుపోయింది.
|
సామకరన్ తీన్మార్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేసింది. షాన్ మసూద్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 38), బాబర్ ఆజామ్(28 బంతుల్లో 2 ఫోర్లతో 32), షాదాబ్ ఖాన్(14 బంతుల్లో 2 ఫోర్లతో 20) మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లకు తోడుగా.. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసారు. బెన్ స్టోక్స్కు ఓ వికెట్ దక్కింది.
|
స్టోక్స్ విరోచిత పోరాటం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్(52 నాటౌట్)కు అండగా జోస్ బట్లర్(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), మొయిన్ అలీ(12 బంతుల్లో 3 ఫోర్లతో 19) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసీం తలో వికెట్ తీసారు. కీలక సమయంలో షాహిన్ షా అఫ్రిది గాయపడటం పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.