పంత్ చేసిన 128 పరుగులే అత్యధికం
ఇప్పటి వరకూ రిషబ్ పంత్ గతేడాది ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై చేసిన 128 పరుగులే భారత్ తరఫున అత్యధికం కావడం విశేషం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రహానే (11), పృథ్వీ షా (10) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. దీంతో 2.3 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది.
బౌండరీల ద్వారా 118 పరుగులు
ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్(63)తో కలిసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. సిక్కిం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయ్యర్ సాధించిన 147 పరుగుల్లో 118 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చిన కావడం విశేషం. అయ్యర్ సెంచరీతో చెలరేగడంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.
104 పరుగులు చేసిన సిక్కిం
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిక్కిం జట్టులో బిపుల్ శర్మ (32) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్కు చేరడంతో సిక్కిం జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. దీంతో 154 పరుగుల భారీ తేడాతో ముంబై విజయం సాధించింది.
టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:
1. శ్రేయాస్ అయ్యర్- 147 (Mumbai vs Sikkim, Syed Mushtaq Ali Trophy 2019)
2. రిషబ్ పంత్- 128* (Delhi Daredevils vs Sunrisers Hyderabad, IPL 2018)
3. మురళీ విజయ్- 127 (Chennai Super Kings vs Rajasthan Royals, IPL 2010)
4. సురేశ్ రైనా- 126* (Uttar Pradesh vs Bengal, Syed Mushtaq Ali Trophy 2018)
5. వీరేంద్ర సెహ్వాగ్- 122 (Kings XI Punjab vs Chennai Super Kings, IPL 2014)