టెస్టు క్రికెట్ 10000పరుగులు:
భారత్ తరఫున టెస్టుల్లో 10,000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్ సునిల్ గవాస్కర్. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘నగర క్రికెట్ చరిత్రలో టీ20 ముంబై లీగ్ ఒక కీలక మైలురాయి. ప్రారంభ ఎడిషన్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ముంబై కుర్రాళ్లలో చాలా ప్రతిభ ఉంది. యువ క్రికెటర్ల సత్తా, నైపుణ్యాలు ప్రదర్శించేందుకు యువ క్రికెటర్లకు ఈ లీగ్ అవసరమే వేదిక కానుంది' అని తెలిపారు.
ముంబై పరిధిలోని ఆటగాళ్ల కోసం:
స్టార్ క్రికెటర్లు తమ సత్తా చాటేందుకు:లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సహకారంతో ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముంబై పరిధిలోని ఆటగాళ్ల కోసం ఈ లీగ్ను నిర్వహిస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానె, పృథ్వీషా, రహానె, సూర్యకుమార్ యాదవ్తో పాటు పలువురు కుర్రాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
మంచి ఫ్లాట్ఫామ్గా :
ఇటీవలే వేలం ముగిసింది. ఆరు జట్లు వాంఖడే స్టేడియంలో మ్యాచ్లు ఆడతాయి. టోర్నమెంట్ మార్చి 11 నుంచి 21 మధ్య జరగనుంది. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ... ముంబై క్రికెట్ అపారమైన ప్రతిభతో దూసుకెళ్తోంది. కుర్రాళ్లు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి, వారి నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఈ లీగ్ మంచి ఫ్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వ్యాఖ్యాతగా రాణిస్తున్న సన్నీ:
లీగ్లో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత సన్నీ వ్యాఖ్యాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
బ్యాటింగ్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుర్రాళ్ల కోసం మరోసారి అంబాసిడర్ కాబోతున్నారు.
క్రికెట్కు అంబాసిడర్గా:
తన సుధీర్ఘ కెరీర్లో ఎన్నో సంస్థలు, కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆయన ఈ సారి కుర్రాళ్ల క్రికెట్కు అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. మార్చి నెలలో జరగనున్న టీ20 ముంబై లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు మాస్టర్ బ్లాస్టర్ నిర్ణయించుకున్నారు.