224
వన్డేల్లో పరుగుల తేడాతో టీమిండియా సాధించిన మూడో అతిపెద్ద విజయం ఇది. 2007లో వెస్టిండిస్ జరిగిన వరల్డ్ కప్లో భాగంగా బెర్ముడాపై 257 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగా.. మళ్లీ 2008లో 256 పరుగుల తేడాతో హాంకాంగ్పై భారత్ గెలిచింది. రెండువందలకు పైగా పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడం ఇది మూడోసారి. 2015లో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ జట్టు 257 పరుగుల తేడాతో ఓడిపోగా.. తాజా ఓటమితో రెండోసారి 200కు పైగా పరుగుల తేడాతో విండీస్ ఓడింది.
211
ఈ మ్యాచ్లో మూడో వికెట్కు రోహిత్ శర్మ, తెలుగు తేజం అంబటి రాయుడు నెలకొల్పిన భాగస్వామ్యం. భారత్ తరఫున ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం కాగా.. ఈ సిరీస్లో రెండోసారి భారత్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం.
7
వన్డేల్లో ఓపెనర్ రోహిత్ శర్మ 150+పైగా స్కోరు నమోదు చేయడం ఇది ఏడోసారి. అంతర్జాతీయ క్రికెట్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 5 సార్లు ఈ ఘనత సాధించారు. తాజా సెంచరీతో రోహిత్ శర్మ తన రికార్డును మరింతగా మెరుగుపరుచుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సనత్ జయసూర్య 4 సార్లు 150కిపైగా పరుగుల సాధించి ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
6
ఓ ద్వైపాక్షిక సిరీస్లో 6 సెంచరీలు నమోదు చేయడం టీమిండియాకు ఇది మూడోసారి. ఈ సిరీస్లో కోహ్లీ 3, రోహిత్ 2 సెంచరీలు సాధించగా... అంబటి రాయుడు సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో 2013-14 సిరీస్లోనూ 2015-16లో జరిగిన సిరీస్లోనూ భారత ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.
162
వన్డేల్లో 2018 ఏడాదికి గాను భారతీయ బ్యాట్స్మన్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. బ్రబౌర్న్ స్టేడియంలో భారీ సెంచరీ నమోదు చేయడం ద్వారా రోహిత్ ఈ రికార్డును నెలకొల్పాడు. అంతేకాదు 2013 నుంచి ప్రతి ఏడాది భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేస్తోన్న భారత ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు.