226/7 ఓవర్నైట్ స్కోరుతో
301 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 226/7 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 74 ఓవర్లలో 243 పరుగులకే ఆలౌటైంది. ఆఖరి రోజు 75 పరుగులు చేయాల్సిన దశలో కేవలం 17 పరుగులు మాత్రమే జోడించి చివరి మూడు వికెట్లు చేజార్చుకుంది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు లంక పతనాన్ని శాసించారు.
ఐదు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌలర్ లీచ్
మొయిన్ అలీ (4/72) ఒకే ఓవర్లో మూడు బంతుల తేడాలో డిక్వెల్లా (35), లక్మల్ (0)ను ఔట్ చేయగా, పుష్పకుమార (1)ను లీచ్ (5/83) పెవిలియన్కు పంపాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్ ఐదు వికెట్లు తీయగా... మొయిన్ అలీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
జో రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. జో రూట్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ విదేశాల్లో సిరీస్ గెలవడం ఇదే మొట్టమొదటిసారి. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన మూడో టెస్టు నవంబర్ 23న కొలంబో వేదికగా ప్రారంభం కానుంది.
స్కోరు వివరాలు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 290
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 336
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 346
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 243.