|
ధనుంజయ బౌలింగ్ యాక్షన్పై ఐసీసీ
దీంతో అతని బౌలింగ్ యాక్షన్ను పరీక్షించనున్నట్టు ఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. "మరో రెండు వారాల్లో ధనంజయ బౌలింగ్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఫలితం వెలువడే వరకు అతను అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయవచ్చు" అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ముగిసిన గాలే టెస్టులో ధనంజయ 184 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.
322/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్
ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 342 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆతిథ్య శ్రీలంక జట్టు 203 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్కు 139 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 322/6 వద్ద గురువారం ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
మరో రోజు మిగిలుండగానే తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం
అనంతరం 462 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఛేదన 250 పరుగులకే ఆలౌట్ కావడంతో మరో రోజు మిగిలుండగానే ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రకటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలాంటి కామెంట్ చేయక పోవడం విశేషం.
నవంబర్ 14 నుంచి రెండో టెస్టు
ఈ సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. చివరిదైన మూడో టెస్టు నవంబర్ 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరగనుంది.