1987 వరల్డ్కప్కు 'రిలయన్స్ వరల్డ్కప్' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?

హైదరాబాద్: భారత దేశం ఆతిథ్యమిచ్చన తొలి వరల్డ్కప్ 1987. అంతకముందు జరిగిన మూడు వరల్డ్కప్లు ఇంగ్లాండ్ వేదికగా జరగా... ఆ తర్వాత జరిగిన నాలుగో వరల్డ్కప్ని ఆసియా ఖండంలో భారత్, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ వరల్డ్కప్ పేరు 'రిలయన్స్ వరల్డ్ కప్'.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

అసోసియేట్ దేశాలకు భారీ మొత్తంలో ఆఫర్
ఈ వరల్డ్కప్ను ఆసియా ఖండంలో నిర్వహించేందుకు గాను అసోసియేట్ దేశాలకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారు. దీనిపై ఇరు దేశాల బోర్డులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య పలుమార్లు చర్చోపచర్చలు సాగాయి. ఇందులో భాగంగా వరల్డ్కప్ నిర్వహణలో భాగంగా ఇండియా పాకిస్తాన్ జాయింట్ మేనేజ్మెంట్ కమిటీ (ఐపీజేఎంసీ) ఏర్పాటు చేశారు.

రాజీవ్ గాంధీ అసహనం
ఆ తర్వాత ఈ వరల్డ్కప్ స్పాన్స ర్షిప్ కోసం పలు వ్యాపారవేత్తలను సంప్రదిస్తే చివరకు లండన్లో స్థిరపడిన ఓ ఎన్నారై బిజినెస్ మ్యాన్ స్పాన్షర్షిప్కు ముందుకొచ్చాడు. అయితే, భారత్లో జరిగే వరల్డ్కప్కు విదేశీ వ్యక్తి టైటిల్ స్పాన్సర్షిప్గా ఉండటం అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ఎంతమాత్రం నచ్చలేదు.

అంబానీని వరల్డ్కప్ స్ఫాన్సర్గా ఒప్పించారు
దీంతో ఐఎస్ బింద్రా, అప్పటి కేంద్ర మంత్రి ఎన్కేపీ సాల్వేలు రిలయన్స్ సంస్థ ఛైర్మ

స్పాన్సర్షిప్ కోసం రూ. 4.17 కోట్లు చెల్లించిన అంబానీ
వరల్డ్కప్కు ముందు భారత్, పాక్ జట్ల మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగబోతోంది కదా. టీవీలో ఆ మ్యాచ్ ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. ఆ మ్యాచ్ జరిగే సమయంలో ప్రధాని పక్కనే నాకు ఓ సీటు ఇవ్వాలని అంబానీ షరతు విధించారు. భారత్ ఆతిథ్యమిచ్చిన 1987 వరల్డ్ కప్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం అప్పట్లో రిలయన్స్ సంస్థ రూ. 4.17 కోట్లు చెల్లించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications